News February 4, 2025
ఇల్లందు: మట్టి పెళ్లలు పడి కార్మికుడు మృతి

ఇల్లందు మండలం రాజీవ్ నగర్ తండా సమీపంలోని క్వారీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 24 ఏరియాకు చెందిన పల్లపు ఎల్లయ్య(40) మట్టి పెళ్లలు పడి మరణించాడని స్థానికులు చెప్పారు. పెద్ద సైజు రాళ్లు కొడుతూ కాసేపు సేద తీరుతున్న సమయంలో మట్టి పెళ్లలు పడినట్లు తెలిపారు. గాయపడిన అతడిని తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.
Similar News
News February 10, 2026
HYD: 10th విద్యార్థినికి తాళి కట్టిన సార్

10వ తరగతి విద్యార్థినికి ఓ టీచర్ తాళి కట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచేసింది. ఘట్కేసర్ పరిధి పోచారంలోని ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ మైటీన్(27) విద్యార్థినికి మాయమాటలు చెప్పి చాటుగా తాళి కట్టాడు. JAN 3 గమనించిన తల్లి, కుమార్తెను నిలదీయగా విషయం చెప్పింది. ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లగా.. స్కూల్కి సంబంధం లేదనటంతో బాధితులు పోచారం PSలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని రిమాండ్కు తరలించారు.
News February 10, 2026
పల్నాడు: లండన్ ఆశ చూపి.. నిలువునా ముంచేశారు!

సత్తెనపల్లి మండలం దీపాలదిన్నెపాలెం గ్రామానికి చెందిన యువకుడిని లండన్లో హోటల్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.4 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇంటర్, హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసిన బాధితుడు 2024 డిసెంబర్లో ఒక వ్యక్తికి ఫోన్ ద్వారా డబ్బులు పంపినట్లు తెలిపాడు. ఇప్పటివరకు ఉద్యోగం ఇవ్వకపోవడంతో పాటు డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
News February 10, 2026
HYD: 10th విద్యార్థినికి తాళి కట్టిన సార్

10వ తరగతి విద్యార్థినికి ఓ టీచర్ తాళి కట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచేసింది. ఘట్కేసర్ పరిధి పోచారంలోని ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ మైటీన్(27) విద్యార్థినికి మాయమాటలు చెప్పి చాటుగా తాళి కట్టాడు. JAN 3 గమనించిన తల్లి, కుమార్తెను నిలదీయగా విషయం చెప్పింది. ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లగా.. స్కూల్కి సంబంధం లేదనటంతో బాధితులు పోచారం PSలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని రిమాండ్కు తరలించారు.


