News March 11, 2025

ఇల్లందు: సకల సదుపాయాలతో ప్రభుత్వాసుపత్రి భవన నిర్మాణం

image

ఇల్లందు పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో రూ.38 కోట్లతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి, రూ.11 కోట్ల 50 లక్షలతో ప్రభుత్వ ఐటీఐ కాలేజీ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పట్టణంలో ఆయా భవన నిర్మాణాల కోసం సేకరించిన స్థలాలను భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వీ.పాటిల్‌తో ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం పరిశీలించారు. వారివెంట ఏరియా జీఎం వీ.కృష్ణయ్య, ఎమ్మార్వో రవికుమార్ ఉన్నారు.

Similar News

News September 16, 2025

హుకుంపేట: JCBని ఢీ కొట్టిన బైక్.. యువకుడి మృతి

image

పాడేరు మండలం చింతలవీధి సమీపంలో ఐటీడీఏ పెట్రోల్ బంక్ వద్ద సోమవారం రాత్రి యాక్సిడెంట్ జరిగింది. దాలిగుమ్మడి గ్రామానికి చెందిన థామస్ ప్రవీణ్ హుకుంపేట నుంచి పాడేరుకు బైక్‌పై వస్తూ JCBని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు పాడేరు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

News September 16, 2025

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

జనగామ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో రేపు జరగబోయే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఏర్పాట్లను పరిశీలించారు. జెండా ఆవిష్కరణ, గౌరవ వందనం ఏర్పాట్లను డీసీపీ రాజమహేంద్ర నాయక్ పరిశీలించారు. వీఐపీ, మీడియా పాయింట్లకు ఇబ్బందులు కలగకుండా సీట్లను సమకూర్చాలని సూచించారు. కలెక్టరేట్ ఏవో, ఆర్డీవో, తహశీల్దార్లు ఉన్నారు.

News September 16, 2025

KNR: పెండింగ్లో 1,810 దరఖాస్తులు

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి వేగవంతంగా పరిష్కరిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో పలు అంశాలపై ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2021 ఫిబ్రవరి నుంచి 27,580 దరఖాస్తులు రాగా 1,810 దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయన్నారు.