News March 11, 2025
ఇల్లందు: సకల సదుపాయాలతో ప్రభుత్వాసుపత్రి భవన నిర్మాణం

ఇల్లందు పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో రూ.38 కోట్లతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి, రూ.11 కోట్ల 50 లక్షలతో ప్రభుత్వ ఐటీఐ కాలేజీ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పట్టణంలో ఆయా భవన నిర్మాణాల కోసం సేకరించిన స్థలాలను భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వీ.పాటిల్తో ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం పరిశీలించారు. వారివెంట ఏరియా జీఎం వీ.కృష్ణయ్య, ఎమ్మార్వో రవికుమార్ ఉన్నారు.
Similar News
News April 16, 2026
గుంటూరులో హిరో బాలయ్య సందడి!

గుంటూరులో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సినీ నటి డింపుల్ హయాతి సందడి చేశారు. వీరిద్దరూ గురువారం ఓ నూతన జువెలరీ షోరూమ్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. షోరూమ్లో డిజైన్లను పరిశీలించిన బాలయ్య యాజమాన్యాన్ని అభినందించారు. తన ప్రియతమ నటుటులను చూసేందుకు అభిమానులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.
News April 16, 2026
‘కంకణం కట్టుకోవడం’ వెనుక ఎంతో అర్థం

ఒక పనిని కచ్చితంగా, దృఢ సంకల్పంతో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారని చెప్పే సందర్భంలో ‘కంకణం కట్టుకోవడం’ అనే జాతీయాన్ని వాడతాం. పెళ్లిళ్లు, శుభకార్యాలు, యజ్ఞాలు, వ్రతాలకు ముందు మణికట్టుకు కంకణ ధారణ చేస్తారు. ఇది మూడు/ఐదు పోగులతో ఉంటుంది. దీన్ని మామిడాకు/తమలపాకు/పసుపుకొమ్ముతో అలంకరిస్తారు. ఇలా చేస్తే ఆ కార్యం విజయవంతంగా పూర్తయ్యేందుకు సర్వేశ్వరుడు రక్షణగా ఉంటారని నమ్మకం.
<<-se>>#EPICSAYINGS<<>>
News April 16, 2026
శాతవాహన వర్సిటీ ఈసీ సభ్యుల నియామకం

కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సభ్యులను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ జీవో విడుదల చేసింది. సభ్యులుగా ప్రొఫెసర్ జాఫర్ జరీ, ప్రిన్సిపల్స్ రమాకాంత్, భిక్షపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ హరికాంత్, లెక్చరర్ రజిత నియమితులయ్యారు. ప్రముఖుల కోటాలో వంగల మురళీ మోహన్, కవిత ఆలేటి, వూటుకూరి రవీందర్ రెడ్డి, సిరిపురం ఈశ్వర్లకు చోటు దక్కింది.


