News December 7, 2024
ఇళ్ల లబ్ధిదారుల వివరాలను యాప్లో ఎంట్రీ చేస్తాం: పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారుల వివరాలను యాప్లో ఒకేసారి ఎంట్రీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అందులో నుంచే దశలవారీగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. గత పాలకులు ధరణి పేరుతో ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, వాటిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. అసైన్డ్ భూముల హక్కులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
Similar News
News January 25, 2025
గ్రామసభలు గొడవలు లేకుండా జరిగాయా?: తాతా మధు
ఖమ్మం: ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సభలు ఎక్కడైనా గొడవలు లేకుండా జరిగాయా అని ఖమ్మం బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ప్రశ్నించారు. వందల మంది లబ్ధిదారులకు పదుల సంఖ్యలో అర్హులను గుర్తించడమేంటని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్నారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత గ్రామ సభల్లో తిరగబడిన జనం రూపంలో కనిపించిందనిన్నారు.
News January 25, 2025
KMM: జులై లోపు మున్నేరు రిటైనింగ్ వాల్ పూర్తి: కలెక్టర్
మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు అవసరమైన భూ సేకరణ, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి మున్నేరు రిటైనింగ్ వాల్ కోసం భూసేకరణ పురోగతి, జరుగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని జులై లోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News January 24, 2025
KMM: క్రీడలు మానసికోల్లాసానికి దోహదం: అడిషనల్ డీసీపీ
క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి దోహదం చేస్తాయని అడిషనల్ డీసీపీ నరేష్కుమార్ తెలిపారు. ఈ మేరకు పుట్టకోట రోడ్డులోని శ్రీచైతన్య స్కూల్లో శుక్రవారం ఉడాన్ క్రీడల ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనారోగ్య సమస్యలు క్రీడలతో దరిచేరవని విద్యాసంస్థల ఛైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ చెప్పారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి సునీల్ రెడ్డి, సైదుబాబు, టెన్నిస్ కోచ్ నాగరాజు పాల్గొన్నారు.