News February 19, 2026

ఇవాళ జగన్ ప్రెస్‌మీట్

image

AP: వైసీపీ అధినేత జగన్ ఇవాళ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు మీడియాతో మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తిరుమల కల్తీ నెయ్యి అంశం, హెరిటేజ్ ఇష్యూ, మండలిలో చర్చకు వచ్చిన పలు అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది.

Similar News

News March 17, 2026

రాష్ట్రానికి అదనంగా 24వేల మెట్రిక్ టన్నుల LPG.. ఆందోళన వద్దు: CM

image

AP: ప్రస్తుతం 15 రోజులకు సరిపడా LPG నిల్వలు ఉన్నాయని, అదనంగా 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ వచ్చిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. గ్యాస్ సిలెండర్ల డెలివరీ సమయాన్ని 1.5 రోజులకు కుదించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరతా లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పైప్డ్ గ్యాస్ నెట్‌వర్క్ పెంచేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.

News March 17, 2026

చదువులో కాకపోయినా.. క్రికెట్‌లో 80% కొట్టేసిన సూర్యకుమార్

image

కెప్టెన్‌గా సూర్యకుమార్ విన్నింగ్ పర్సంటేజ్ 80% దాటింది. ‘చదువులో నాకు ఎప్పుడూ 50-60% కూడా దాటలేదు. కానీ ఇప్పుడు ఆ పర్సంటేజీని క్రికెట్‌లో సాధిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అని సరదాగా వ్యాఖ్యానించారు. తన ఫ్యామిలీ మొదట్లో చదువుపై ఫోకస్ చేయమన్నా.. తర్వాత తన ప్యాషన్‌ను గుర్తించి సపోర్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు. WC నెగ్గిన తర్వాత కూడా తన భార్య దేవిషా తనలో అహంకారం పెరగకుండా చూస్తోందన్నారు.

News March 17, 2026

బెంగాల్‌లో ‘ఢిల్లీ కా లడ్డూ’ పని చేయదు: మమతా బెనర్జీ

image

బెంగాల్‌లో BJPకి గతం కంటే ఈసారి సీట్లు తగ్గుతాయని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ఆటలాడినా ఆ పార్టీకి ఏ మాత్రం గెలిచే అవకాశం లేదన్నారు. ఈ ఎన్నికల్లో ‘బెంగాల్’ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో ‘ఢిల్లీ కా లడ్డూ’ పని చేయదని ఎద్దేవా చేశారు. కాగా WBలో మొత్తం 294 సీట్లకు గాను TMC 291 చోట్ల పోటీ చేస్తోంది. 3 సీట్లను మిత్రపక్షం BGPMకు కేటాయించింది.