News March 21, 2025

ఇవాళ రాత్రికి మంత్రి ఫరూక్ సతీమణి అంత్యక్రియలు

image

మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సతీమణి షహనాజ్ ఇవాళ తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో, అందులోనూ ఇవాళ శుక్రవారం కావడంతో ఈ రాత్రికే ఆమె అంత్యక్రియలను నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఫిలింనగర్‌లోని మంత్రి నివాసంలో పార్థివదేహాన్ని సందర్శనార్థం ఉంచారు. రాత్రి 8 గంటలకు HYDలోని ఆగాపుర, పాన్‌మండి ఖబరస్తాన్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి.

Similar News

News November 3, 2025

PDPL: బాయిలర్ పేలిన ఘటనలో గాయపడ్డ కూలీ మృతి

image

బాయిలర్ పేలి గాయపడ్డ రైస్ మిల్ కూలీ మృతి చెందాడు. సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ వివరాల ప్రకారం.. గత నెల 29న సుల్తానాబాద్ మండలం కాట్నేపల్లిలోని కనకదుర్గ రైస్ మిల్ బాయిలర్ పేలింది. ఈ ఘటనలో సుల్తానాబాద్ కు చెందిన కూలీ గంగారపు కుమార్ (55) తీవ్రంగా గాయపడ్డాడు. కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి భార్య సరోజన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News November 3, 2025

HYD: ఘోర ప్రమాదం తర్వాత దృశ్యాలు

image

చేవెళ్ల మం. మీర్జాగూడలో రోడ్డు ప్రమాదం అనంతరం భయానక దృశ్యాలు వెలుగుచూశాయి. టిప్పర్ డ్రైవర్‌ డెస్క్ మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. ఇక బస్సు ఒకవైపు మొత్తం ధ్వంసం అయ్యింది. ముందు భాగంతో పాటు వెనక చక్రాల వరకు క్యాబిన్ ఎగిరిపోయింది. రాడ్లు, సీట్లు ఇతరత్ర భాగాలు పూర్తిగా విరిగిపోయాయి. బస్సు, టిప్పర్ తాజా దృశ్యాలు చూసిన జనం హడలెత్తిపోయారు.

News November 3, 2025

HYD: ఘోర ప్రమాదం తర్వాత దృశ్యాలు

image

చేవెళ్ల మం. మీర్జాగూడలో రోడ్డు ప్రమాదం అనంతరం భయానక దృశ్యాలు వెలుగుచూశాయి. టిప్పర్ డ్రైవర్‌ డెస్క్ మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. ఇక బస్సు ఒకవైపు మొత్తం ధ్వంసం అయ్యింది. ముందు భాగంతో పాటు వెనక చక్రాల వరకు క్యాబిన్ ఎగిరిపోయింది. రాడ్లు, సీట్లు ఇతరత్ర భాగాలు పూర్తిగా విరిగిపోయాయి. బస్సు, టిప్పర్ తాజా దృశ్యాలు చూసిన జనం హడలెత్తిపోయారు.