News March 21, 2025
ఇవాళ రాత్రికి మంత్రి ఫరూక్ సతీమణి అంత్యక్రియలు

మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సతీమణి షహనాజ్ ఇవాళ తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో, అందులోనూ ఇవాళ శుక్రవారం కావడంతో ఈ రాత్రికే ఆమె అంత్యక్రియలను నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఫిలింనగర్లోని మంత్రి నివాసంలో పార్థివదేహాన్ని సందర్శనార్థం ఉంచారు. రాత్రి 8 గంటలకు HYDలోని ఆగాపుర, పాన్మండి ఖబరస్తాన్లో అంత్యక్రియలు జరగనున్నాయి.
Similar News
News November 15, 2025
జగిత్యాల: గంజాయి కేసులో ముగ్గురికి 7 ఏళ్ల జైలు

జగిత్యాల పట్టణ పోలీస్ దర్యాప్తులో బయటపడ్డ గంజాయి పెంపకం, సరఫరా కేసులో ముగ్గురికి జిల్లా ఫస్ట్ అదనపు సెషన్స్ జడ్జి శ్రీ నారాయణ 7 ఏళ్ల జైలు శిక్ష, ఒక్కరికి రూ.10 వేల జరిమానా విధించారు. నిందితులు మేకల రాజు, సాయి, చందు 250 గ్రాముల గంజాయి వ్యాపారంలో ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు.
News November 15, 2025
Way2News కథనం.. మంత్రి ఆదేశాలతో పనులు

నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండు అండర్ బ్రిడ్జి, ఫ్లైఓవర్పైన జాయింట్ల వద్ద రూ.40లక్షలతో మరమ్మతులు చేపడుతున్నట్లు కమిషనర్ నందన్ తెలిపారు. ఈ పనులు 16వ తేదీ నుంచి సుమారుగా 45 రోజులపాటు జరుగుతాయన్నారు. మంత్రి నారాయణ ఆదేశించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ సమస్యపై ఇటీవల “మంత్రి వర్యా.. ఇదీ మీ సమస్య కాదా” అన్న శీర్షికన Way2News కథనం ప్రచురించింది. స్పందించిన మంత్రి మరమ్మతులకు ఆదేశించారు.
News November 15, 2025
కలెక్టరేట్లో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

తిరుపతి కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా విద్యాశాఖ బాలల దినోత్సవం నిర్వహించింది. ఇందులో భాగంగా రోజూ 3 KMపైగా నడిచి పాఠశాలకు వచ్చే 30 మంది గిరిజన విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సైకిళ్లను దాతలు అందజేశారు. DEO K.V.N.కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల పురోగతికి తోడ్పడుతున్న దాతకు విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.


