News October 7, 2024

ఇసుకపై ఏలూరు జేసీ కీలక ప్రకటన

image

ఏలూరు జిల్లాలో ప్రస్తుతం నెలకు సరిపడా ఇసుక ఉందని జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి వెల్లడించారు. ఉచిత ఇసుక విధానం అమలుపై ఎస్పీ ప్రతాప్ శివకిషోర్‌తో కలిసి జేసీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పట్టిసీమ, గూటాల, గూటాల-1 డీ-సిల్టేషన్ పాయింట్స్ ద్వారా త్వరలో ఇసుక అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. ఇసుక విషయంలో సమస్యలు ఎదురైతే 88865 42999, 95339 22444, 9493040757కు కాల్ చేయవచ్చని సూచించారు.

Similar News

News January 2, 2026

ప.గో జిల్లాలో కిడ్నాప్ కలకలం

image

ఆకివీడు మండలంలోని తాళ్లకోడు ఎన్టీఆర్ కాలనీలో శుక్రవారం మధ్యాహ్నం కిడ్నాప్ ఉదంతం కలకలం రేపింది. కాలనీకి చెందిన ఐదేళ్ల చిన్నారిపై ఆగంతకులు స్ప్రే చల్లి ఎత్తుకెళ్లినట్లు స్థానిక దివ్యాంగురాలు రుక్మిణి కుమారి తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్ఐ హనుమంతు నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

News January 2, 2026

ప.గో: ‘వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి’

image

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం-2026 సందర్భంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి గోడపత్రికలు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తతతో ఉండాలన్నారు.

News January 1, 2026

భీమవరం: కేంద్ర మంత్రి వర్మకు న్యూఇయర్ శుభాకాంక్షలు

image

కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను గురువారం ఆయన కార్యాలయంలో పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కలెక్టర్ చదలవాడ నాగరాణి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు మంత్రికి పుష్పగుచ్ఛాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, పలు ప్రజాహిత అంశాలపై వారు చర్చించారు.