News August 23, 2024
ఇసుక అక్రమ తవ్వకాలు.. రవాణాను కట్టడి చేయాలి: కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాలను కట్టడి చేసే బాధ్యత జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్కు అప్పగించామని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఇసుక కార్యకలాపాలు, అమలుపై లైన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఎస్పీ రత్నతో పాటు అడిషనల్ ఎస్పీ విష్ణు, ఇన్ఛార్జ్ డీఆర్ఓ భాగ్యరేఖ పాల్గొన్నారు.
Similar News
News October 24, 2025
కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్

భారీ వర్షాల నేపధ్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉండరాదన్నారు. ఇబ్బందులు ఎదురైతే సహాయం కోసం 8500292992కు కాల్ చేయాలన్నారు.
News October 24, 2025
పోలీసుల సేవలపై వ్యాసరచన పోటీలు: ఎస్పీ

పోలీసుల అమర వీరుల వారోత్సవాలు జరుగుతున్నట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. అనంతపురం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పోలీసుల విధులు, సేవలు, త్యాగాల గురించి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. సమాజంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. పోలీసుల సేవలపై వ్యాసరచన పోటీలు నిర్వహించామని ఎస్పీ తెలిపారు.
News October 23, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు విద్యార్థి ఎంపిక

ఇటీవల అనంతపురంలో జరిగిన జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలలో యాడికికి చెందిన విద్యార్థి తృషిత అత్యంత ప్రతిభ కనబరిచింది. దీంతో గుంతకల్ డివిజన్ జట్టుకు ఎంపికయింది. డివిజనల్ స్థాయి పోటీలలోనూ అత్యంత ప్రతిభ కనబరిచడంతో నిర్వాహకులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో తృషిత పాల్గొంటుంది.


