News February 22, 2025

ఇసుక ఓవర్ లోడింగ్‌కు పాలు పెడితే కఠిన చర్యలు: DSP

image

ఓవర్ లోడింగ్‌లను అరికట్టేందుకు మల్లంపల్లిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ను ములుగు DSP రవీందర్ పరిశీలించారు. చెక్ పోస్టులో ఉన్న సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా DSP రవీందర్ మాట్లాడుతూ.. ఎవరైనా ఇసక ఓవర్ లోడింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News October 27, 2025

HYD: కలెక్టర్ల సమక్షంలో నేడు లక్కీ డ్రా

image

HYD, MDCL, RR, VKB జిల్లాల కలెక్టర్ల సమక్షంలో నేడు ఉ.11 గంటలకు మద్యం షాపులకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. శంషాబాద్, సరూర్‌నగర్ డివిజన్లలోని మద్యం దుకాణాలకు శంషాబాద్ మల్లికా కన్వెన్షన్ సెంటర్‌లో లక్కీ డ్రా నిర్వహించనుండగా.. సరూర్‌నగర్‌లో 7,845, శంషాబాద్‌లో 8,536, మేడ్చల్‌లో 5,791, వికారాబాద్‌లో 1,808, సికింద్రాబాద్‌లో 3,022, హైదరాబాద్‌లో 3,201, మల్కాజిగిరిలో 6,063 దరఖాస్తులు వచ్చాయి.

News October 27, 2025

చిరంజీవి ఫొటోలు మార్ఫింగ్.. కేసు నమోదు

image

మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ బారిన పడ్డారు. AI సాయంతో తన ప్రతిష్ఠను దెబ్బ తీసేలా డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలు రూపొందిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇటీవల HYD CP సజ్జనార్‌కూ ఫిర్యాదు చేశారు. కాగా అనుమతి లేకుండా చిరంజీవి పేరును వాణిజ్య ప్రయోజనాలకు వాడకూడదని సిటీ సివిల్ కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.

News October 27, 2025

CM చంద్రబాబు పల్నాడు పర్యటన షెడ్యూల్ ఇదే.!

image

CM చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా నేడు పల్నాడు (D) వెల్దుర్తి రానున్నారు. షెడ్యూల్‌ను CM కార్యాలయం విడుదల చేసింది. ఉదయం 10.15 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. 10:30కి ఏపీ సచివాలయానికి చేరుకుంటారు. 11. 55 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 12 గంటలకు హెలికాప్టర్‌లో వెల్దుర్తి బయలుదేరతారు. ఒంటి గంటకు MLA తనయుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొని 1.10కి తిరిగి హెలికాప్టర్‌లో అమరావతి బయలుదేరతారు.