News September 26, 2024
ఇసుక ట్రాక్టర్లను పరిశీలించిన కలెక్టర్

చిత్తూరు రూరల్ మండలం, దిగువమాసపల్లె వద్ద బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఇసుక స్టాక్ ను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుకను తరలిస్తున్నారు లేదా అని ట్రాక్టర్ డ్రైవర్లతోపాటు యజమానులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు కానీ, మధ్యవర్తులుగాని ఇసుకను ప్రభుత్వ నిర్దేశిత ధర కంటే ఎక్కువకు తీసుకోవాలని బలవంతం చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు
Similar News
News November 17, 2025
చిత్తూరు: 27 మంది సచివాలయ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు

27 మంది సచివాలయం సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం ఆదేశించారు. అనధికారికంగా సెలవుపై ఉండటంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆయన ఆదేశించారు. మెడికల్ లీవ్లో ఉన్న 152 మందిని మెడికల్ బోర్డులో పరీక్షల నిర్వహించి, తగిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ఇందులో అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News November 17, 2025
చిత్తూరు: 27 మంది సచివాలయ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు

27 మంది సచివాలయం సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం ఆదేశించారు. అనధికారికంగా సెలవుపై ఉండటంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆయన ఆదేశించారు. మెడికల్ లీవ్లో ఉన్న 152 మందిని మెడికల్ బోర్డులో పరీక్షల నిర్వహించి, తగిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ఇందులో అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News November 17, 2025
చిత్తూరు: కుంకీ ఏనుగు జయంత్కు మస్త్

కుంకి ఏనుగుల్లో ఒకటైన జయంత్కు మస్త్ రావడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. సాధారణంగా ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య మగ ఏనుగులు పునరుత్పత్తి హార్మోన్ల పెరుగుదల వలన మస్త్ వస్తుంది. ఈ సమయంలో ఏనుగులు చాలా దూకుడుగా ప్రవర్తిస్తాయి. ఏనుగులు ఈ దశలో అదుపు తప్పి ప్రవర్తించి, మనుషులపై లేదా ఇతర ఏనుగులపై దాడి చేసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో జయంత్ను వెటర్నరీ డాక్టర్ పరిశీలించారు.


