News October 28, 2024
ఇసుక ధర టన్నుకు రూ.88 తగ్గింపు: కలెక్టర్

ఇసుకకు సీనరేజీ ఫీజు, డీఎంఎఫ్, మెరిట్ కింద మెట్రిక్ టన్నుకు రూ.88 ఉండగా, ప్రస్తుతం ప్రభుత్వం ఆ ఫీజులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ పీ.రంజిత్ బాషా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు అక్రమంగా ఇసుకను తరలించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News December 8, 2025
కర్నూలు SP చెంతకు 119 ఫిర్యాదులు

కర్నూలు SP చెంతకు 119 ఫిర్యాదులు వచ్చాయని వాటిని విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. SP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 119 ఫిర్యాదులు స్వీకరించామన్నారు. ప్రజల సమస్యలను వ్యక్తిగతంగా విని సంబంధిత పోలీసులను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా SP విక్రాంత్ పాటిల్ ఆదేశించారు.
News December 8, 2025
కర్నూలు: హలో యువత మేలుకో పోస్టర్ విడుదల

కర్నూలు జిల్లాలో యువతలో మత్తు పదార్థాల ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి అయ్యప్ప రాష్ట్ర సమితి ముద్రించిన “హలో యువత మేలుకో-చెడు వ్యసనాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకో” నినాదంతో వాల్ పోస్టర్లను అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐలు శ్రీధర్, చాంద్ బాషా, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాములు, శ్రీనివాసులు, నగర అధ్యక్షుడు నాగరాజు, నాయకులు చంటి, దస్తగిరి పాల్గొన్నారు.
News December 8, 2025
నకిలీ కాల్స్కి మోసపోవద్దు: ఎస్పీ

ఇటీవలి రోజుల్లో క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెప్పి ఓటీపీ, కార్డ్ నంబర్, సీవీవీ, ఇతర వివరాలు అడిగి భారీగా సైబర్ మోసాలు జరుగుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. బ్యాంకులు ఎప్పుడూ ఓటీపీ, పాస్వర్డ్, సీవీవీ ఫోన్లో అడగవు. లిమిట్ పెంపు/కార్డ్ అప్గ్రేడ్ అంటూ వస్తున్న అనుమానాస్పద కాల్స్కు స్పందించవద్దు. తెలియని లింకులు, యాప్లు డౌన్లోడ్ చేయవద్దు అన్నారు.


