News July 7, 2024

ఇసుక ప్రైవేటుగా విక్రయిస్తే చర్యలు: జిల్లా అధికారి

image

పల్నాడు జిల్లాలో సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం చేపడుతున్నట్లు గనులు భూగర్భ శాఖ జిల్లా అధికారి నాగిని తెలిపారు. నరసరావుపేటలోని జిల్లా కార్యాలయంలో ఆమె శనివారం మాట్లాడుతూ.. కృష్ణానది సమీప యార్డుల్లో నిల్వ చేసిన ఇసుక టన్ను రూ.191.52గా ఉన్నతాధికారులు నిర్ణయించారన్నారు. అయితే ఎక్కడైనా ఇసుక ప్రైవేటుగా విక్రయించినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News October 29, 2025

GNT: తుపాను దెబ్బకు వరి పంటలపై ఆందోళన

image

మొంథా తుపాను ప్రభావంతో మంగళవారం కురిసిన వర్షాలు రైతులను కలవరపెడుతున్నాయి. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వరి పంటలు ఈనె, గింజ పాలుదశల్లో ఉండగా భారీ వర్షం, గాలుల తాకిడికి నేలవాలుతున్నాయి. ఇప్పటికే 20 శాతం వరి పంటలు నష్టపోయినట్లు అంచనా. పంట తాలుగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబరులోనే తుపాను రావడంతో కోత ముందు కష్టాలు పెరిగాయని చెబుతున్నారు.

News October 29, 2025

అర్థరాత్రి ఆర్టీజీఎస్‌లో మంత్రి లోకేశ్ సమీక్ష

image

తుపాను తీవ్రతపై మంత్రి లోకేశ్ అర్థరాత్రి 12 గంటలకు ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి అనిత, మంత్రి నారాయణ పాల్గొన్నారు. తుపాన్ తీరం దాటే సమయం కావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోకేశ్ ఆదేశించారు. ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి ఆయన ఈ రాత్రికి ఆర్టీజీఎస్ కేంద్రంలోనే బస చేయనున్నారు. పునరావాస కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు.

News October 29, 2025

ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్: కలెక్టర్

image

తుఫాను కారణంగా ఆకస్మిక వరదలకు అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. తుఫాను సహాయక చర్యలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాత్రి సమయంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వాగులు, వంకలు ఎవరు దాటకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.