News February 6, 2025
ఇసుక మాఫియాపై సీఎం ఉక్కు పాదం..!

భద్రాద్రి జిల్లాలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న 17 ఇసుక ర్యాంపులను నిలిపివేయాలని సీఎంవో ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రీచ్ల యాజమాన్యం వ్యవహరిస్తుండటం, వే బిల్లులు లేకుండా రవాణా చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో సీఎం అధికారులను ఆదేశించారు.
Similar News
News March 17, 2025
జూలపల్లి: రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల సుల్తానాబాద్ మైదానంలో పెద్దపల్లి జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో జూలపల్లి కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ తేలుకుంట విద్యార్థులు జి.మణిక్రాంత్, సాన్వి శ్రీ విద్యార్థులు 100mts, 400mts పరుగుపందెంలో పాల్గొని హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ, హెచ్ఎం, అభినందించారు.
News March 17, 2025
నంద్యాల కలెక్టరేట్కు 209 అర్జీల రాక

నంద్యాల కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే జరిగింది. జిల్లా నలుమూలాల నుంచి ప్రజలు తరలి వచ్చి తమ సమస్యలను అధికారులకు వివరించారు. మొత్తంగా 209 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు పరిష్కరించిన 27,854 ఫిర్యాదుదారుల నుంచి అభిప్రాయాలు సేకరించాలన్నారు.
News March 17, 2025
NRPT: ప్రజావాణికి 30 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ వాటిని సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 30 ఫిర్యాదులు వచ్చాయన్నారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు.