News September 18, 2024
ఇసుక రీచ్ల వద్ద రాత్రి సమయంలో ఎవరూ బస చేయకూడదు: కలెక్టర్

ఇసుక రీచ్ల వద్ద రాత్రి సమయాలలో ఎవరూ బస చేయరాదని సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం నుంచి జిల్లాలోని సీసీ రేవు, పీసీ రేవు వద్ద ఇసుక సరఫరాకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లోడింగ్ జరుగుతుందన్నారు. కొత్త మార్గదర్శకాల మేరకు ఉచిత ఇసుక సరఫరా చేస్తామన్నారు.
Similar News
News December 22, 2025
ATP: అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.. చోరీ సొత్తు స్వాధీనం

బెలుగుప్ప పోలీసులు సోమవారం ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. వారి నుంచి 34 గ్రాముల బంగారం, 15 తులాల వెండి, రూ.1.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ శివ వివరాల కమేరకు.. కర్ణాటక ప్రాంతానికి చెందిన ఐదుగురు ముఠాగా ఏర్పడి తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. వీరు బెలుగుప్ప మండలంలో చోరీలు చేశారు. ముఠాలో ఇద్దరిని అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
News December 22, 2025
అనంతపురం: కరెంటోళ్ల జనబాట పోస్టర్ ఆవిష్కరణ

విద్యుత్ వినియోగదారుల సమస్యలకు సత్వరమే పరిష్కారం అందించాలనే లక్ష్యంతో AP SPDCL కరెంట్ టోళ్ల జన బాట పేరిట మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో కరెంట్ టోళ్ల జన బాట పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
News December 22, 2025
అనంతపురం: ఉద్యోగాలను సొంతం చేసుకోండి..!

అనంతపురంలోని SSBN డిగ్రీ కళాశాలలో ఈనెల 26న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అడ్మిట్ కార్డుతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలిపారు. అభ్యర్థులు 10th ఆపై చదివి, 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలన్నారు.


