News February 20, 2025

ఇసుక సరఫరాపై నిఘా పెంచాలి: ఇలా త్రిపాఠి 

image

వంగమర్తి, ఇటుకల పహాడ్ ఇసుక రీచ్‌ల నుంచి సరఫరా చేసే ఇసుకపై పూర్తి నిఘా ఉంచాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మైనింగ్, తదితర శాఖల అధికారులతో కలిసి శాలిగౌరారం మండలం, వంగమర్తి, ఇటుకల పహాడ్ ఇసుక రీచ్‌ల వద్ద ఇసుక తవ్వే ప్రాంతాలను తనిఖీ చేశారు.

Similar News

News October 18, 2025

న్యాయ అవగాహన పెంపులో పీఎల్‌వీల సేవ కీలకం: జడ్జి పురుషోత్తం రావు

image

సమాజంలో న్యాయ అవగాహన కల్పించడమే పారా లీగల్ వాలంటీర్ల(పీఎల్‌వీ) ప్రధాన లక్ష్యమని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పురుషోత్తం రావు అన్నారు. పీఎల్‌వీల ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. న్యాయం అందరికీ చేరేలా పీఎల్‌వీలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరగబోయే జాతీయ కాన్ఫరెన్స్‌కు ఎంపికైన శ్రీకాంత్‌ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

News October 18, 2025

NLG: టెండర్ల జాతర.. ఒక్క షాపుకే 100 దరఖాస్తులు !

image

ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇవాళ చివరి రోజు కావడంతో ఉదయం నుంచే ఎక్సైజ్ కార్యాలయాలు కిటకిటలాడాయి. ఉమ్మడి జిల్లాలో 329 షాపులకు టెండర్లు స్వీకరిస్తున్నారు. అయితే నల్గొండ జిల్లా ధర్వేశిపురం వైన్స్ కోసం 100కు పైగా టెండర్లు దాఖలైనట్లు సమాచారం. నేడు బంద్ కారణంగా కొంత ఇబ్బంది కలిగినప్పటికీ DDలు తీసి ఉంటే రాత్రి వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News October 18, 2025

నాగార్జునసాగర్‌లో గవర్నర్ నజీర్‌కు కలెక్టర్ స్వాగతం

image

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ నాగార్జునసాగర్ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయనకు ఘన స్వాగతం పలికారు. గవర్నర్ పర్యటన దృష్ట్యా సాగర్ పరిసరాల్లో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.