News November 29, 2024

ఇస్తేమాకు రూ.10 కోట్ల నిధులు కేటాయించాం: మంత్రి ఫరూక్

image

ఆత్మకూరులో జనవరి 7, 8, 9వ తేదీల్లో జరగబోయే ఉమామి తబ్లిగే ఇస్తేమాను జయప్రదం చేయాలని మంత్రి ఫరూక్ కోరారు. ఉత్సవ ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు కర్నూలు నన్నూరు టోల్ ప్లాజా దగ్గర ఇస్తామాను ఏర్పాటు చేశామన్నారు. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇస్తామాకు రూ.10 కోట్లు నిధులు కేటాయించారని తెలిపారు.

Similar News

News January 22, 2026

నంద్యాల: Night view అదరహో!

image

శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రం రాత్రి వేళ విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలుగుతోంది. బుధవారం రాత్రి చిత్రీకరించిన రమణీయ దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుండటంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు. ఈ అద్భుతమైన రాత్రి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఓం నమఃశివాయ!

News January 22, 2026

పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం పథకాల అమలుపై సమీక్ష

image

పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం పథకాలను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలని సీఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ పథకాలతో పాటు పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం అమలు తీరుపై సమీక్షించారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ సరి ఈ సమావేశంలో పాల్గొని, జిల్లాలో పథకాల పురోగతిని వివరించారు.

News January 22, 2026

పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం పథకాల అమలుపై సమీక్ష

image

పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం పథకాలను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలని సీఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ పథకాలతో పాటు పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం అమలు తీరుపై సమీక్షించారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ సరి ఈ సమావేశంలో పాల్గొని, జిల్లాలో పథకాల పురోగతిని వివరించారు.