News February 24, 2025

ఇస్రో నుంచి యువికా 2025 కు దరఖాస్తు చేసుకోండి

image

పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం పేరుతో యువిక -2025 కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. సోమవారం నుంచి మార్చి 23 దాకా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించారు. 8వ తరగతి ఉత్తీర్ణులై 9వ తరగతి చదువుతున్న వారు అర్హులు. https//jigyasa.iirs.gov.in/yuvika అనే సైట్ లో అర్హత కలిగిన విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఇస్రో కోరింది.

Similar News

News November 10, 2025

RGM: బేస్ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన సింగరేణి సీఎండీ

image

రామగుండంలోని సింగరేణి సంస్థ ఓసీపీ-5 ఆవరణలో నూతనంగా నిర్మించిన బేస్ వర్క్‌షాప్‌ను సంస్థ సీఎండీ బలరాం ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్, అధికారులు ఆయనను సన్మానించారు. అనంతరం సీఎండీ క్వారీలోకి వెళ్లి బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, ఓబీ రిమూవల్‌ను పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రాజెక్టుపై నాటిన మొక్కలను కూడా ఆయన పరిశీలించారు.

News November 10, 2025

నేడు భద్రాచలం, కొత్తగూడెంలో ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్

image

ప్రజల సౌకర్యార్థం సోమవారం భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు వస్తున్నందున, వారి సౌకర్యార్థం డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇతర సమస్యలపై కలెక్టరేట్ ఇన్‌వార్డ్‌లో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.

News November 10, 2025

10న యథావిధిగా ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’: కలెక్టర్

image

అమలాపురం కలెక్టరేట్‌లో ఈనెల 10 సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. జిల్లా స్థాయి, ఆర్డీవో, మండల, మున్సిపల్ కార్యాలయాల్లో కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని కోరారు.