News April 9, 2025

ఇస్రో యువిక -2025కు జగిత్యాల విద్యార్థిని

image

ఇస్రో నిర్వహిస్తున్న యువిక -2025 యంగ్ సైంటిస్ట్ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కొలకాని అశ్విని ఎంపికైంది. దేశవ్యాప్తంగా ఇస్రోకు చెందిన 8 పరిశోధన కేంద్రాలలో మేలో 12 రోజులు అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నారు. తెలంగాణ నుంచి ఎంపికైన 12 మందిలో అశ్విని ఒకరు కావడం విశేషం. దీంతో అశ్వినికి టీచర్లు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

Similar News

News November 18, 2025

తిరుమల: వాళ్లకు దర్శనం ఎలా గోవిందా..?

image

తిరుమల వైకుంఠ ద్వార <<18320086>>దర్శనానికి <<>>సంబంధించి మొదటి 3రోజులకు ఆన్‌లైన్ విధానం ద్వారా టోకెన్లు జారీ చేయనున్నారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తెలియని భక్తుల పరిస్థితి ఏంటి? 100 కిలో మీటర్లు నడిచి ఆ 3రోజులు తిరుమలకు వచ్చే తమిళనాడు భక్తులకు దర్శనం దొరికేది ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

News November 18, 2025

తిరుమల: వాళ్లకు దర్శనం ఎలా గోవిందా..?

image

తిరుమల వైకుంఠ ద్వార <<18320086>>దర్శనానికి <<>>సంబంధించి మొదటి 3రోజులకు ఆన్‌లైన్ విధానం ద్వారా టోకెన్లు జారీ చేయనున్నారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తెలియని భక్తుల పరిస్థితి ఏంటి? 100 కిలో మీటర్లు నడిచి ఆ 3రోజులు తిరుమలకు వచ్చే తమిళనాడు భక్తులకు దర్శనం దొరికేది ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

News November 18, 2025

MDCL: అనుమతులు తక్కువ.. ఆస్పత్రులు ఎక్కువ!

image

మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో వేల సంఖ్యలో ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు ఉండగా, ఇందులో రిజిస్ట్రేషన్ సహా వివిధ అనుమతులతో కొనసాగుతున్నవి కేవలం 2,840 ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్ని ఆస్పత్రుల్లో తనిఖీలు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పలుచోట్ల శవాలను ఆస్పత్రుల్లో పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉందంటున్నారు.