News April 9, 2025

ఇస్రో యువిక -2025కు జగిత్యాల విద్యార్థిని

image

ఇస్రో నిర్వహిస్తున్న యువిక -2025 యంగ్ సైంటిస్ట్ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కొలకాని అశ్విని ఎంపికైంది. దేశవ్యాప్తంగా ఇస్రోకు చెందిన 8 పరిశోధన కేంద్రాలలో మేలో 12 రోజులు అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నారు. తెలంగాణ నుంచి ఎంపికైన 12 మందిలో అశ్విని ఒకరు కావడం విశేషం. దీంతో అశ్వినికి టీచర్లు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

Similar News

News November 14, 2025

కేసీఆర్ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది: రేవంత్

image

TG: కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరని, ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రెస్‌మీట్లో మాట్లాడుతూ ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్‌ను విమర్శించడం భావ్యం కాదు. ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాక స్పందిస్తా. ఆయన కుర్చీ గుంజుకోవడానికి కేటీఆర్, హరీశ్ ప్రయత్నిస్తున్నారు. వారి పరిస్థితి ఏంటో చూద్దామని జూబ్లీహిల్స్‌లో నిరూపించుకోవాలని వదిలేశారు’ అని వ్యాఖ్యానించారు.

News November 14, 2025

సంబంధం లేని వ్యక్తులు CID విచారణలో: భూమన

image

CIDకి సంబంధం లేని వ్యక్తి తిరుమల <<18287141>>పరకామణి <<>>కేసు విచారణ చేపడుతున్నారని భూమన ఆరోపించారు. ‘లక్ష్మణరావు అనే వ్యక్తి విచారణ పేరుతో సతీశ్‌ను బండబూతులు తిట్టాడు. సీఐడీలో భాగస్వామి కానీ వ్యక్తి విచారణలో ఏవిధంగా పాల్గొంటారు. న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు’ అని భూమన విమర్శించారు.

News November 14, 2025

ప్రకృతి వ్యవసాయం లాభదాయకం: కలెక్టర్

image

ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యానికి, పర్యావరణానికి, రైతులకు లాభదాయకమని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. స్థానిక యూత్ క్లబ్‌లో నిర్వహించిన రిసోర్స్ పర్సన్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం పెరగడంతో భూమి సారం తగ్గిపోగా, అవశేషాలు ఆహారం ద్వారా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. సహజ ఎరువులు భూమి సారాన్ని పెంపొందిస్తాయని చెప్పారు.