News June 11, 2024
ఈఏపీసెట్లో టెక్కలి విద్యార్థికి రాష్ట్రస్థాయి 12వ ర్యాంకు

టెక్కలికి చెందిన మల్లిపెద్ది ప్రణవ్ సాయి అనే విద్యార్థికి మంగళవారం విడుదలైన ఈఏపీసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి 12వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచాడు. తూర్పుగోదావరి జిల్లాలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన ప్రణవ్ సాయి ఇటీవల విడుదల అయిన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో కూడా రాష్ట్రస్థాయి 62వ ర్యాంకు, నీట్ లో ఆల్ ఇండియా 430వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచాడు. విద్యార్థిని స్థానికులు అభినందించారు.
Similar News
News March 23, 2025
క్షయరహిత సమాజానికి కృషి చేస్తాం: డీఎంహెచ్ఓ

క్షయ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ డా. బాలకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమాలపై శనివారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. క్షయ అంటువ్యాధి అని, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. మైక్రో బ్యాక్టీరియా ట్యూబర్ క్లోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాది వ్యాప్తి చెందుతుందన్నారు.
News March 22, 2025
శ్రీకాకుళం: జాబ్ మేళా.. యువతకు ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా బలగ హాస్పిటల్ జంక్షన్లో ఉన్న పారిశ్రామిక శిక్షణ కేంద్రం (డీఎల్డీసీ-ఐటీఐ)లో ఈనెల 24 వ తేదీన జరగనుందని డీఎల్డీసీ అసిస్టెంట్ డైరెక్టర్ వై.రామ్మోహనరావు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, తదితర అర్హత కలిగిన యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News March 22, 2025
సంతబొమ్మాళి యువకుడికి రూ.1.3 కోట్ల కొలువు

సంతబొమ్మాళి మండలం ఉద్దండపాలెంకు చెందిన హనుమంతు సింహాచలంకు పోలాండ్ దేశంలో రూ.1.3 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం లభించింది. విశాఖలో MHRM విద్య పూర్తిచేసిన యువకుడు పోలాండ్లో ఒక డైరీ సంస్థలో HR Assistant గా ఎంపికయ్యారు. ఈ మేరకు యువకుడిని గ్రామస్థులు, స్నేహితులు, బంధువులు అభినందించారు. యువకుడు తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు.