News April 16, 2025
ఈకేవైసీ ప్రక్రియకు ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు

కర్నూలు జిల్లాలో 21,92,047 రేషన్ కార్డులలో 19,56,828 యూనిట్లకు ఈకేవైసీ పూర్తి కాగా, 1,82,991 యూనిట్లకు ఇంకా పూర్తి చేయాల్సి ఉందని జేసీ నవ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈకేవైసీ పూర్తి కాని వ్యక్తుల పేర్లు ఈపీఓఎస్ మెషిన్లో రెడ్ మార్కుతో చూపిస్తుందన్నారు. ఏప్రిల్ 30 లోపు ఎన్ఎఫ్ఎస్ఓ కార్డుదారులు దేశవ్యాప్తంగా, ఎన్ఎన్ఎఫ్ఎస్ఓ కార్డు దారులు రాష్ట్రంలో ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.
Similar News
News April 19, 2025
శ్రీనగర్ SSPగా కర్నూల్ వాసి.!

కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ సందీప్ చక్రవర్తి జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ SSPగా నియమితులయ్యారు. శుక్రవారం జరిగిన IPS అధికారుల బదిలీల్లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆయనను శ్రీనగర్ SSPగా నియమించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన కీలక పదవుల్లో చేయడంపై చిన్ననాటి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
News April 19, 2025
కర్నూలు: సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే రక్షణ

సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం తెలిపారు. ప్రజలు వారి విలువైన సమాచారం నష్టపోడానికి, మోసపోవడానికి ప్రధానంగా అత్యాశ, అశ్రద్ధ కారణాలని సూచించారు. మోసానికి గురైనవారు వెంటనే 1930కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు. అలాగే www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. అప్రమత్తతే రక్షణని ఆయన హెచ్చరించారు.
News April 19, 2025
శ్రీనగర్ ASPగా కర్నూల్ వాసి.!

కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ సందీప్ చక్రవర్తి జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ ASPగా నియమితులయ్యారు. శుక్రవారం జరిగిన IPS అధికారుల బదిలీల్లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆయనను శ్రీనగర్ ASPగా నియమించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన కీలక పదవుల్లో చేయడంపై చిన్ననాటి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.