News April 16, 2025

ఈకేవైసీ ప్రక్రియకు ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు

image

కర్నూలు జిల్లాలో 21,92,047 రేషన్ కార్డులలో 19,56,828 యూనిట్లకు ఈకేవైసీ పూర్తి కాగా, 1,82,991 యూనిట్లకు ఇంకా పూర్తి చేయాల్సి ఉందని జేసీ నవ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈకేవైసీ పూర్తి కాని వ్యక్తుల పేర్లు ఈపీఓఎస్ మెషిన్లో రెడ్ మార్కుతో చూపిస్తుందన్నారు. ఏప్రిల్ 30 లోపు ఎన్ఎఫ్ఎస్ఓ కార్డుదారులు దేశవ్యాప్తంగా, ఎన్‌ఎన్ఎఫ్ఎస్ఓ కార్డు దారులు రాష్ట్రంలో ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.

Similar News

News April 24, 2025

క్రీడాకారులను అభినందించిన జిల్లా కలెక్టర్

image

జాతీయ స్థాయి టైక్వాండో పోటీలకు ఎంపికైన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఘనంగా సత్కరించారు. మే నెలలో ఉత్తరాఖండ్‌లో జరగబోయే జాతీయస్థాయి కేడేట్, జూనియర్స్ విభాగాలలో జిల్లా క్రీడాకారులు పాల్గొని విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎస్డీవో భూపతిరావు, కోచ్ షబ్బీర్ హుస్సేన్ పాల్గొన్నారు.

News April 23, 2025

597 మార్కులు సాధించిన ఆదోని విద్యార్థిని.!

image

ఆదోని పట్టణంలోని ఎస్.కె.డి కాలనీకి చెందిన దేవరకొండ సలీమా పదో తరగతి ఫలితాల్లో టౌన్ టాపర్‌గా నిలిచింది. బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో 597 మార్కులు సాధించింది. తండ్రి రంజాన్ బాషా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ పిల్లలను చదివించారు. తన కష్టానికి ఫలితంగా.. తన కూతురు మంచి మార్కులు సాధించి తమ గౌరవాన్ని నిలబెట్టిందని తండ్రి సంతోషించారు.

News April 23, 2025

10th Results: 25వ స్థానంలో కర్నూలు జిల్లా

image

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కర్నూలు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 31,185 మంది పరీక్ష రాయగా 20,584 మంది పాసయ్యారు. 16,326 మంది బాలురులో 9,854 మంది, 14,859 మంది బాలికలు పరీక్ష రాయగా 10,730 మంది పాసయ్యారు. 66.01 పాస్ పర్సంటైజ్‌తో కర్నూలు జిల్లా 25వ స్థానంలో నిలిచింది.

error: Content is protected !!