News February 6, 2025

‘ఈగల్’ వింగ్ విశాఖ సీఐగా ఎస్.రమేశ్

image

విశాఖపట్నం జిల్లా జోనల్ “ఈగల్” వింగ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్‌గా ఎస్.రమేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్, స్మగ్లింగ్ జరిగినా టోల్ ఫ్రీ నెంబర్ 1972కి డయల్ చేయాలని ప్రజలకు సూచించారు. ఈయన విశాఖ జిల్లాలో 2010 నుంచి 2022 వరకు పలు విభాగలలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించారు.

Similar News

News March 28, 2025

ఏప్రిల్ 1న పదో తరగతి సోషల్ పరీక్ష: విశాఖ డీఈవో

image

రంజాన్ మార్చి 31న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఈవో ప్రేమ్ కుమార్ శుక్రవారం తెలిపారు. అయితే పదో తరగతి సోషల్ పరీక్ష మార్చి 31వ తేదీన నిర్వహించనున్నట్లు ముందు హల్ టికెట్స్‌లో ప్రచురితం చేశారని, రంజాన్ పండుగ కావడంతో ఏప్రిల్ 1న పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలన్నారు.

News March 28, 2025

విశాఖ: ‘పోటెన్షియల్ లింక్‌డ్ క్రెడిట్ ప్లాన్’ విడుద‌ల‌

image

విశాఖ జిల్లా అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని రూ.23,870.62 కోట్లతో క్రెడిట్ ప్లాన్ రూపొందించినట్లు నాబార్డ్ డెవ‌ల‌ప్‌మెంట్ మేనేజ‌ర్ బ‌సంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్‌లో నాబార్డ్ 2025-26 ‘పోటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్’ను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ విడుద‌ల చేశారు. ఈ ప్రణాళిక ముఖ్యంగా MSMEలు, పునరుత్పాదక ఇంధనం, ఎగుమతి క్రెడిట్ సుస్థిర వ్యవసాయంపై దృష్టి సారించింద‌ని పేర్కొన్నారు.

News March 28, 2025

గాజువాకలో బాలికతో పాటు మరో వ్యక్తి ఆత్మహత్య

image

గాజువాక వడ్లపూడి అప్పికొండ కాలనీలోని ఓ ఇంట్లో బాలికతో పాటు మరో వ్యక్తి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. దువ్వాడ పోలీసుల వివరాల ప్రకారం.. మర్రిపాలెంకి చెందిన అమీరుద్దిన్ ఖాన్(36) సింహాచలంలో బాలిక(17) తల్లి నిర్వహిస్తున్న హోటల్లో పని చేసేవాడు. అతని వైఖరి నచ్చగా బాలిక తల్లి పని నుంచి తొలగించింది. కాగా శుక్రవారం అమీరుద్దీన్ రూమ్‌‌లో బాలిక, అమీరుద్దిన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

error: Content is protected !!