News March 18, 2025

ఈడీ వద్దకు చేరిన బెట్టింగ్ యాప్స్‌ కేసు

image

బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్ల వివరాలపై ఈడీ ఆరా తీసింది. చెల్లింపుల వ్యవహారంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను తెప్పించుకుంది. హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తోంది. 11 మంది వివరాలు సేకరించి.. ఎవరెవరికి ఎంత డబ్బులు ముట్టాయని ఈడీ ఆరా తీస్తోంది.

Similar News

News April 24, 2025

HYD: ఎండలు మండుతున్నాయ్.. 27 వరకు జాగ్రత్త!

image

HYD, RR, MDCL జిల్లాల పరిధిలో ఎండ 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతను దాటేసింది. ఇబ్రహీంపట్నం, MCపల్లి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో నిన్న 40-42 డిగ్రీలవరకు నమోదైంది. 27వ తేదీ వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని TGDPS తెలిపింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 నుంచి సా.4 గంటల వరకు బయటకు రాకుండా ఉండటం మంచిదని IAS అరవింద్ కుమార్ సూచించారు. గొడుగులు, టోపీలు వాడటంతో పాటు అధికంగా పానీయాలు తాగాలన్నారు.

News April 24, 2025

HYD: ఎండలు.. సర్దుకుపోదాం!

image

HYDలో ఎండలు దంచికొడుతున్నాయి. G+1 భవనం, పెంట్ హౌస్, రేకుల ఇంట్లో ఉండే మధ్య తరగతి, పేదవాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సీలింగ్, టేబుల్ ఫ్యాన్ ఉన్నా ఉపశమనం లేదని వాపోతున్నారు. మార్కెట్‌లో కూలర్లు, ACలకు డిమాండ్‌కు తగ్గట్లే ధరలున్నాయి. పెద్ద మొత్తంలో డబ్బుల్లేక EMI దిక్కు అయ్యిందని మిడిల్ క్లాస్‌ ఫ్యామిలీ అంటున్నారు. స్థోమత లేని పేదోడు షాపులో కొనలేక, ఇంట్లోనే సర్దుకుపోతున్నాడు.

News April 23, 2025

HYD: సంగారెడ్డి జైలుకు అఘోరి

image

లేడీ అఘోరిని పోలీసులు అరెస్ట్ చేసి నార్సింగి PSకు తరలించి, 2 గంటల పాటు విచారించిన అనంతరం చేవెళ్ల ప్రభుత్వ దవాఖానాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరు పర్చారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని అఘోరి చెప్పడంతో లీగల్ ఎయిడ్ సర్వీసెస్ న్యాయవాది కుమార్‌ను జడ్జి నియమించారు. వాదనలు విన్న జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు అఘోరిని సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.

error: Content is protected !!