News April 2, 2025

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

image

ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన  భూదాన్ పోచంపల్లి మండలంలో జరిగింది. మండల పరిధిలోని దేశ్‌ముఖి గ్రామంలో పడవు పడిన ఓ క్వారీ గుంతలో ఈతకు వెళ్లి బీటెక్ ఫస్ట్ ఇయర్‌కి చదువుతున్న గంద జయన్ (18), బొడ్డు శ్యామ్ శరన్ (18) అనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మొత్తం నలుగురు విద్యార్థులు మధ్యాహ్నం ఈతకు వెళ్లారు. అందులో ఇద్దరు ఈతరాక నీటిలో మునిగిపోయారు. పోలీసులు మృతదేహాల కోసం గాలిస్తున్నారు.

Similar News

News April 10, 2025

నా తర్వాతి సినిమా ఇదే: రామ్‌గోపాల్ వర్మ

image

తన కెరీర్లో తొలిసారిగా హారర్ కామెడీ సినిమా చేస్తున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విటర్లో తెలిపారు. ‘‘ప్రజలకు భయమేస్తే పోలీసుల వద్దకు పరిగెడతారు. మరి పోలీసులే భయపడితే’ అన్న కాన్సెప్ట్‌తో హారర్ కామెడీ జానర్లో సినిమాను తీస్తున్నా. మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘పోలీస్ స్టేషన్లో దెయ్యం’ అన్నది సినిమా టైటిల్‌. ‘చనిపోయిన వారిని చంపలేరు’ అన్నది ట్యాగ్‌లైన్‌’ అని RGV పేర్కొన్నారు.

News April 10, 2025

పార్వతీపురం మన్యం జిల్లాకు మంజూరైన బీసీ యూనిట్లు ఇవే..

image

పార్వతీపురం మన్యం జిల్లాకు బీసీ యూనిట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాచిపెంట మండలానికి 52, గరుగుబిల్లి 87, కొమరాడ 50, సీతానగరం 35, సాలూరు 42, గుమ్మలక్ష్మీపురం 14, కురుపాం 5, భామిని 23, జియ్యమ్మవలసకు 3 మంజూరైనట్లు తెలిపారు. మండలాలు, మున్సిపాలిటీ పరిధిలో చర్యలు వేగవంతం చేసి 11వ తేదీ నాటికి సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.

News April 10, 2025

15న మంత్రివర్గ భేటీ.. కీలక పథకాలకు ఆమోదం?

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 15న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. దీంతో రేపు సా.4 గంటల్లోగా అన్ని శాఖలు తమ ప్రతిపాదనలను పంపాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. కాగా క్యాబినెట్ భేటీలో మెగా డీఎస్సీతోపాటు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు, పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించే అవకాశం ఉంది.

error: Content is protected !!