News September 10, 2024
ఈనెల 11 నుంచి ఉచిత ఇసుక విధానం: కలెక్టర్

ఏలూరు జిల్లాలో ఈనెల 11 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉచిత ఇసుక విధానం అమలవుతుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో ఇసుక సమన్వయ శాఖల అధికారులు, లారీ యజమానులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాలసీపై అవగాహన కలిగించారు. పారదర్శకంగా ఇసుక సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Similar News
News December 1, 2025
మొగల్తూరు: ‘నేడు పేరుపాలెం బీచ్కు రావొద్దు’

తుఫాను హెచ్చరికలు, సముద్రంలో అలల ఉద్ధృతి కారణంగా జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పేరుపాలెం బీచ్కి సోమవారం సందర్శకులను అనుమతించబోమని మొగల్తూరు ఎస్ఐ జి.వాసు తెలిపారు. వాతావరణ మార్పులతో అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యాటకులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలన్నారు. బీచ్ సందర్శనకు రావొద్దని సూచించారు.
News December 1, 2025
భీమవరంలో నేడు యధావిధిగా PGRS.!

భీమవరం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజలనుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేనివారు 1100 కాల్ సెంటర్ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్సైట్లో తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 1, 2025
భీమవరంలో నేడు యధావిధిగా PGRS.!

భీమవరం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజలనుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేనివారు 1100 కాల్ సెంటర్ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్సైట్లో తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


