News October 11, 2024
ఈనెల 13న కొడంగల్ రానున్న CM రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 13న కొడంగల్ పట్టణంలోని తన నివాసానికి రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందారం ప్రశాంత్ గురువారం తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే దసరా తర్వాత కార్యకర్తలను కలవడం ఆనవాయితీగా వస్తుంది. ఈనెల 12న వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకల్లో పాల్గొని పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం మరుసటి రోజు కొడంగల్ రానున్నారు.
Similar News
News December 17, 2025
MBNR జిల్లాలో తొలి సర్పంచ్ గెలుపు ఇక్కడే.!

పాలమూరు జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, తొలి ఫలితం వెలువడింది. భూత్పూర్ మండలం లంబాడికుంట తండా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాన్య నాయక్ ఘనవిజయం సాధించారు. BRS మద్దతుతో పోటీ చేసిన ఆయన, ప్రత్యర్థులపై ఆధిక్యం కనబరిచి విజేతగా నిలిచారు. జిల్లాలో వెలువడిన మొదటి ఫలితం ఇదే కాగా అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. గ్రామంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
News December 17, 2025
MBNR జిల్లాలో 81.44 శాతం ఓటింగ్.. లెక్కింపు ప్రారంభం

MBNR జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి జిల్లా వ్యాప్తంగా 81.44 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 1,16,379 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ముగిశాయి. మ.2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సా.5 గంటల వరకు ఫలితాలు వెలువడనున్నాయి.
News December 17, 2025
మహబూబ్నగర్లో 25% ఓటింగ్ నమోదు

మహబూబ్నగర్ జిల్లాలోని ఐదు మండలాల్లో మూడో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 25 శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. మొత్తం 1,42,909 మంది ఓటర్లకు గాను 36,232 మంది తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకున్నారు. ఓటర్ల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.


