News April 13, 2025

ఈనెల 14న జరిగే P.G.R.S రద్దు: కలెక్టర్

image

ఈనెల 14న పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. సోమవారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. ఈ కారణంగా జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో జరిగే ప్రజా సమస్యలపరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రజలందరూ గమనించి సహకరించాలని కోరారు. 

Similar News

News December 3, 2025

VKB: లైన్ మెన్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష: ఎస్పీ

image

కరెంట్ షాక్‌తో యువకుని మృతికి కారణమైన విద్యుత్ శాఖ లైన్‌మెన్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ఈ మేరకు జిల్లా జడ్జి శ్రీనివాస్ రెడ్డి శిక్ష ఖరారు చేశారు. 2020లో వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలార్ దేవరంపల్లిలో లైన్‌మెన్ అబ్దుల్ జలీల్, ఎల్‌సీ (Line Clear) తీసుకోకుండా నిర్లక్ష్యంగా కుషా రెడ్డిని కరెంట్ పోల్‌పైకి ఎక్కించి మృతికి కారణమవడంతో ఈ శిక్ష పడినట్లు ఎస్పీ తెలిపారు.

News December 3, 2025

చిన్న తప్పుతో రూ.లక్షలు కోల్పోతున్నారు!

image

సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌తో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ‘FLAT SIP’ హ్యాబిట్‌తో రూ.లక్షలు కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు. ‘ఎప్పుడూ ఒకే అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేయకూడదు. పెట్టుబడి మొత్తంలో ఏడాదికి కనీసం 10% పెంచాలి. Ex: నెలకు ₹10వేలు చొప్పున 20ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే (12% రిటర్న్స్‌తో) ₹99 లక్షలొస్తాయి. అదే ఏటా 10% పెంచుకుంటూ పోతే ₹1.5కోట్ల వరకు వస్తాయి’ అని వివరిస్తున్నారు.

News December 3, 2025

స్టేడియాల్లో సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉందా?

image

తమ ఆరాధ్య క్రికెటర్లను కలిసేందుకు ఫ్యాన్స్ వెర్రెత్తి పోతున్నారు. గ్రౌండ్లలోకి దూసుకెళ్లి ప్లేయర్ల కాళ్లపై పడుతున్నారు. మొన్న కోహ్లీ, నిన్న హార్దిక్‌పై ఫ్యాన్స్ విపరీత అభిమానం చూపారు. దీంతో జాతీయ స్థాయి ప్లేయర్లు ఆడే స్టేడియాల్లో సెక్యూరిటీపై క్రీడా వర్గాల నుంచి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇలా దూసుకొచ్చేవారి వల్ల ఆటగాళ్లకు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? అని నిలదీస్తున్నాయి. మీరేమంటారు?