News April 13, 2025
ఈనెల 14న జరిగే P.G.R.S రద్దు: కలెక్టర్

ఈనెల 14న పల్నాడు జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. సోమవారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. ఈ కారణంగా జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో జరిగే ప్రజా సమస్యలపరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రజలందరూ గమనించి సహకరించాలని కోరారు.
Similar News
News September 16, 2025
వక్ఫ్ చట్టంపై SC ఉత్తర్వులను స్వాగతించిన KTR

TG: వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర <<17717100>>ఉత్తర్వులను<<>> మాజీ మంత్రి KTR స్వాగతించారు. ఈ చట్టంలోని వివాదాస్పద నిబంధనలను BRS మొదటి నుంచి వ్యతిరేకిస్తోందన్నారు. ‘చట్టంలోని సమస్యలపై మేం పోరాడాం. ఒక వ్యక్తి ముస్లిం అని ఎవరు నిర్ణయిస్తారు? ప్రభుత్వ అధికారి ఏకపక్షంగా వక్ఫ్ ఆస్తుల యాజమాన్యాన్ని ఎలా నిర్ణయిస్తారు? ఇలాంటి అనేక సమస్యలు ఈ చట్టంలో ఉన్నాయి. ఇవి విభజన రాజకీయాలకు ఆజ్యం పోయగలవు’ అని ఆయన అన్నారు.
News September 16, 2025
జగిత్యాల: చిన్నారుల మహిళలకు పోషణ మహోత్సవ కార్యక్రమం

చిన్నారుల మహిళలకు పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు సమగ్ర శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు చక్కెర, ఉప్పు, నూనెల వాడకం పరిమితిపై ప్రచార కార్యక్రమాలు జరిపించనున్నట్లు పేర్కొన్నారు.
News September 16, 2025
పెద్దపల్లిలో సమావేశమైన బీజేపీ నేతలు

సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సేవా పఖ్వాడా కార్యక్రమాలపై పెద్దపల్లి జిల్లా నేతలు నేడు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమాల ద్వారా స్వదేశీ, ఆత్మనిర్భర్ సందేశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. వీటిలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నల్ల మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారు.