News April 13, 2025
ఈనెల 14న జరిగే P.G.R.S రద్దు: కలెక్టర్

ఈనెల 14న పల్నాడు జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. సోమవారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. ఈ కారణంగా జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో జరిగే ప్రజా సమస్యలపరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రజలందరూ గమనించి సహకరించాలని కోరారు.
Similar News
News November 26, 2025
వనపర్తి: నామినేషన్లకు సర్వం సిద్ధం: కలెక్టర్

గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ప్రక్రియను గురువారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జిల్లాలో ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు ఇప్పటికే టీ.పోల్లో అప్లోడ్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
News November 26, 2025
GNT: హెడ్ కానిస్టేబుల్ చీటింగ్

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలువురు పోలీసులను అధిక డబ్బు పేరుతో మోసం చేసిన ఘటన చోటు చేసుకుంది. పల్నాడుకి చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ బియాండ్ ఇన్ ఫీనిటీ పేరుతో పోలీసులను రూ.5,500తో రిజిస్టర్ అయ్యి రూ.25 వేలు కడితే 26 లక్షల కారు, క్రిప్టో కరెన్సీ పేరుతో కాయిన్స్ కొంటే కోటీశ్వరులు అవుతారని నమ్మించి ఆన్లైన్లో డబ్బులు కట్టించి మోసం చేశాడు. గుంటూరు, పల్నాడు పోలీసులు ఎక్కువ మోసపోయినట్లు సమాచారం.
News November 26, 2025
పెద్దపల్లిలో కుమారుడి కళ్లను దానం చేసిన తండ్రి

పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఫుట్బాల్ ఆడుతూ కిందపడి 10వ తరగతి విద్యార్థి కన్నవేన <<18394891>>ప్రతీక్<<>> మృతి చెందాడు. పెద్దపల్లి, కరీంనగర్ ఆసుపత్రులకు తరలించినా ఫలితం దక్కలేదు. తన కుమారుడు మరణించినా కళ్లు సజీవంగా ఉండాలని ప్రతీక్ తండ్రి కుమారస్వామి నిర్ణయించుకున్నారు. లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో ప్రతీక్ రెండు కళ్లను ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి దానం చేశారు.


