News April 13, 2025
ఈనెల 14న జరిగే P.G.R.S రద్దు: కలెక్టర్

ఈనెల 14న పల్నాడు జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. సోమవారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. ఈ కారణంగా జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో జరిగే ప్రజా సమస్యలపరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రజలందరూ గమనించి సహకరించాలని కోరారు.
Similar News
News April 17, 2026
పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

దేశంలో ప్రతిష్ఠాత్మకమైన పద్మ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోందని జిల్లా కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలు, ప్రతిభ కనబరిచిన అర్హులైన వ్యక్తులను ఎంపిక చేసి ఈ అవార్డులు అందజేస్తారని తెలిపారు.
News April 17, 2026
గంటలోపు ఆసుపత్రికి చేరిస్తే రూ.25వేల రివార్డు: మంత్రి

నాగోల్ డ్రైవింగ్ సెంటర్లో ‘అరైవ్- అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహనదారులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రమాద బాధితులను గంటలోపు ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడితే రూ.25వేల నగదుతో ‘రహవీర్ అవార్డు’ ఇస్తామని ప్రకటించారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
News April 17, 2026
మహిళా బిల్లుకు గతంలోనే మద్దతిచ్చాం: CBN

AP: ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు పలుకుతున్నామని CM చంద్రబాబు TDP ఆఫీసులో మీడియాతో పేర్కొన్నారు. ‘గతంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు మద్దతు ప్రకటించాం. కొన్ని కారణాలతో అప్పుడది కార్యరూపం దాల్చలేదు’ అని వివరించారు. ఈసారైనా బిల్లు నెగ్గి అమలవుతుందా? అని మీడియా ప్రశ్నించగా ‘మహిళా బిల్లు ఆమోదం పొందితే మీరు వంటింట్లో పని చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా’ అని CBN వ్యాఖ్యానించారు.


