News April 13, 2025

ఈనెల 14న జరిగే P.G.R.S రద్దు: కలెక్టర్

image

ఈనెల 14న పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. సోమవారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. ఈ కారణంగా జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో జరిగే ప్రజా సమస్యలపరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రజలందరూ గమనించి సహకరించాలని కోరారు. 

Similar News

News April 23, 2025

పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై కోర్టుకెక్కనున్న మాజీ కోచ్

image

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జాసెన్ గిలెస్పీ పాకిస్థాన్ జట్టుకు గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు కోచ్‌గా పనిచేశారు. తనకు ఇవ్వాల్సిన జీతాన్ని పాకిస్థాన్ బకాయి పెట్టిందని ఆయన తాజాగా ఆరోపించారు. దానిపై కోర్టును ఆశ్రయించనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన కాంట్రాక్టును ఉల్లంఘించి నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధాంతరంగా పదవి నుంచి తప్పుకొన్నారని, తామేమీ బకాయిపడలేదని పీసీబీ తెలిపింది.

News April 23, 2025

జనగామ: వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో కమిటీ పాలకవర్గ సమావేశం

image

జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ ఛైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అధ్యక్షతన మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమైన అభివృద్ధి పనులు ఎజెండాగా పెట్టి జనగామ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, అదేవిధంగా రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని పాలక మండలి సభ్యులకు సూచించారు.

News April 23, 2025

వికారాబాద్: జిల్లాలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి: స్పీకర్

image

జిల్లాలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా సరైన విధంగా నీరు అందించాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులకు సూచించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో వివిధ అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. స్పీకర్ ప్రసాద్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ నీరు ప్రతిఇంటికి అందించాలన్నారు.

error: Content is protected !!