News March 13, 2025

ఈనెల 15న విజయనగరంలో జాబ్ మేళా

image

APSSDC ఆధ్వర్యంలో ఈనెల 15న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. స్థానిక మహారాజ అటానమస్ కాలేజీలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మేళా ప్రారంభమవుతుందన్నారు. మిరాకిల్ సాప్ట్‌వేర్ సిస్టంలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, బీకాం, BBA, MBA, MCA, MSC, BCA చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. >Share It

Similar News

News December 6, 2025

విజయనగరం: పెన్షన్ దారులకు అలర్ట్.!

image

జిల్లాలో కుటుంబ పెన్షన్ దారులు 2026 సంవత్సరానికి లైఫ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28లోపు సమర్పించాల్సి ఉంటుందని జిల్లా ఖజానా అధికారి నాగ మహేశ్ శనివారం తెలిపారు. నవంబర్, డిసెంబర్ 2025లో సమర్పించిన లైఫ్ సర్టిఫికెట్లు 2026కి చెల్లవని, ఇప్పటికే సమర్పించినవారు మళ్లీ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఉప ఖజానా కార్యాలయాల్లో సర్టిఫికెట్లు సమర్పించవచ్చని తెలిపారు.

News December 6, 2025

రామేశ్వరంలో రోడ్డు ప్రమాదంపై మంత్రుల దిగ్భ్రాంతి

image

రామేశ్వరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసులు మృతి చెందడం పట్ల రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవదర్శనం కోసం వెళ్లిన భక్తులు ఈ పరిస్థితుల్లో మృత్యువాత పడటం అత్యంత దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వం వారి వెంట ఉంటుందని పేర్కొన్నారు.

News December 6, 2025

VZM: వెనుకబడ్డ మండలాలపై కలెక్టర్ అసహనం

image

100 రోజుల పనిదినాల కల్పనలో వెనుకబడిన మండలాలపై కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనిదినాల కల్పనపై శుక్రవారం వీసీ నిర్వహించారు. వంగర, మెంటాడ, జామి, వేపాడ, కొత్తవలస, తదితర మండలాలకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ప్రగతి చూపని మండలాల్లో పనులను వెంటనే వేగవంతం చేయాలని, వేతనం రూ.300కి తగ్గకుండా పనులు కల్పించాలని ఏపీడీ, ఎంపీడీఓ, ఏపీఓలకు సూచించారు.