News April 12, 2024

ఈనెల 15న విజయనగరం జిల్లాకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన తేదీలు ఖరారైనట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈనెల 15న రాజాంలో సాయంత్రం 3గంటలకు జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. మరుసటి రోజు విజయనరగంలో సాయంత్రం 4 గంటలకు, నెల్లిమర్ల ప్రధాన కూడలిలిలో రాత్రి 7 గంటలకు జరిగే సభల్లో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పాల్గొనున్నట్లు వెల్లడించారు. కాగా.. అభ్యర్థుల ప్రకటన అనంతరం మొదటిసారి వీరు జిల్లాకు వస్తున్నారు.

Similar News

News December 10, 2025

VZM: దుకాణాల్లో పండగ ఆఫర్లు

image

క్రిస్మస్‌, సంక్రాంతి పంగల సందర్భంగా APCO ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిందని విజయనగరం మండల వాణిజ్య అధికారి RV మురళీ కృష్ణ మంగళవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై సాధారణ 40% తగ్గింపుతో పాటు అదనపు రాయితీలు కూడా ఉంటాయన్నారు. గంటస్తంభం, MG రోడ్డు, పూల్‌భాగ్, చీపురుపల్లిలో ఉన్న విక్రయ శాలల్లో లభిస్తాయన్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి ప్రోత్సహించాలన్నారు.

News December 10, 2025

VZM: ‘గ్రామీణ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.84.62 కోట్లు మంజూరు’

image

జిల్లాలో గ్రామీణ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.84.62 కోట్లు మంజూరయ్యాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. మొత్తం 67 పనులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందన్నారు. బొబ్బిలి-8, చీపురుపల్లి-10, గజపతినగరం-7, నెల్లిమర్ల-17, రాజాం-6, ఎస్‌.కోట-7, విజయనగరం-12 పనులకు ఆమోదం లభించిందన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఈ అనుమతులు వచ్చినట్లు వెల్లడించారు.

News December 10, 2025

VZM: ‘జిల్లాలో ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలి’

image

జిల్లాలో వివిధ ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్‌.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం విజయనగరం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిగింది. కేంద్రీయ గిరిజన వర్శిటీ, భోగాపురం విమానాశ్రయం, తోటపల్లి, తారకరామ ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, కుర్ధారోడ్-విజయనగరం మూడో రైల్వే లైన్, కొత్తవలస-విజయనగరం నాలుగో రైల్వే లైన్ భూ సేకరణ స్థితిపై సమీక్షించారు.