News March 9, 2025

ఈనెల 16న ఎన్టీఆర్ జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నీ 

image

ఎన్టీఆర్ జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్‌ను ఈ నెల 16వ తేదీన ఆంధ్ర లయోలా కాలేజీలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వైఈఎస్- జె వ్యవస్థాపకులు, డైరెక్టర్ బి. బాలకుమార్, మ్యాజిక్ యూత్ ప్రతినిధి హర్షిత తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను లయోలా కాలేజీలో శనివారం ఆవిష్కరించారు. విజేతలకు నగదు బహుమతి, ట్రోఫీలను అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. 

Similar News

News December 4, 2025

కామారెడ్డి: డీజీపీకి పూల మొక్కను అందజేసిన కలెక్టర్

image

డీజీపీ శివధర్ రెడ్డిని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డిలో మర్యాద పూర్వకంగా కలసి పూల మొక్కను అందజేశారు. జిల్లాలో శాంతి భద్రతల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.

News December 4, 2025

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: డిజిపి

image

గ్రామపంచాయతీ ఎన్నికలను నిస్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని డిజిపి శివధర్ రెడ్డి సూచించారు. గురువారం ఆదిలాబాద్‌లో ఉమ్మడి జిల్లాల ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. గ్రామాలను సందర్శిస్తూ ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పించాలన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు పటిష్ఠంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతల, మతపరమైన సమస్యల తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News December 4, 2025

మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖ: హోం మంత్రి

image

మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖకు గుర్తింపు పొందిన సందర్భంగా బీచ్‌ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. హోం మంత్రి అనిత పాల్గొని ర్యాలీ ప్రారంభించారు. మహళల భద్రతే ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యమని, సంఘటన జరిగిన వెంటనే శిక్షలు పడుతున్నాయన్నారు. శక్తి టీమ్స్, యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామన్నారు. విశాఖకు జాతీయ స్థాయిలో ప్రఖ్యాతలు తీసుకువచ్చిన పోలీసులను మంత్రి అనిత అభినందించారు.