News March 9, 2025

ఈనెల 16న ఎన్టీఆర్ జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నీ 

image

ఎన్టీఆర్ జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్‌ను ఈ నెల 16వ తేదీన ఆంధ్ర లయోలా కాలేజీలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వైఈఎస్- జె వ్యవస్థాపకులు, డైరెక్టర్ బి. బాలకుమార్, మ్యాజిక్ యూత్ ప్రతినిధి హర్షిత తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను లయోలా కాలేజీలో శనివారం ఆవిష్కరించారు. విజేతలకు నగదు బహుమతి, ట్రోఫీలను అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. 

Similar News

News September 15, 2025

నెల్లూరు:13 మందికి ఎంపీడీవోలుగా పదోన్నతి

image

11 మంది డిప్యూటీ ఎంపీడీవోలకు ఇద్దరు ఏవోలకు ఎంపీడీవోలుగా పదోన్నతి కల్పిస్తూ సోమవారం జడ్పీ ఇన్‌ఛార్జ్ సీఈవో మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లాలో నలుగురు డిప్యూటీ ఎంపీడీవోలకు, తిరుపతి జిల్లాలో ఇద్దరు డిప్యూటీ ఎంపీడీవోలకు ప్రకాశం జిల్లాలో నలుగురు, బాపట్ల జిల్లాలో ఒకరికి పదోన్నతి కల్పించారు. అలాగే నెల్లూరు జిల్లాలో ఏవోగా పనిచేస్తున్న ఒకరిని బాపట్ల జిల్లాలో ఒకరిని ఎంపీడీవోగా నియమించారు.

News September 15, 2025

రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా: అచ్చెన్న

image

AP: రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 18వ తేదీలోపు కృష్ణపట్నం పోర్ట్ ద్వారా 11,605, కాకినాడ ద్వారా 18,765, మంగళూరు ద్వారా 2,700, జైగడ్ పోర్ట్ ద్వారా 8,100 MT యూరియా రవాణా జరుగుతుందని వెల్లడించారు. YCP కావాలనే యూరియా సరఫరాపై అబద్ధాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. రైతులను భయపెట్టి ప్రయోజనం పొందాలన్న ప్రయత్నం విజయవంతం కాదని హితవు పలికారు.

News September 15, 2025

బాపట్ల పోలీస్ పీజీఆర్ఎస్‌కు 54 అర్జీలు

image

బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఎస్పీ ఉమామహేశ్వర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 54 అర్జీలు అందినట్లు తెలిపారు. ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని వివరించారు.