News November 6, 2024

‘ఈనెల 18న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి’

image

తమ సమస్యలను పరిష్కరించాలని గూడూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు మెడికల్ ఆఫీసర్ ప్రత్యూషకు వినతిపత్రం ఇచ్చారు. సీఐటీయూ డివిజన్ కార్యదర్శి జే.మోహన్, ఆశా వర్కర్స్ యూనియన్ మండల నాయకురాలు శేషమ్మ మాట్లాడుతూ.. గతంలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను అమలు చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఈనెల 18న కర్నూలు కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని ఆశా వర్కర్లకు పిలుపునిచ్చారు.

Similar News

News November 23, 2025

సీమ అభివృద్ధికి సత్య సాయిబాబా కృషి: కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు. వేడుకల్లో కర్నూలు ఎంపీ నాగరాజు, కలెక్టర్ డా.ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. సత్య సాయిబాబా రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు.

News November 23, 2025

అదే మా లక్ష్యం: కర్నూలు ఎస్పీ

image

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ప్రతి శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. హెల్మెట్ తప్పనిసరి, ఓవర్‌స్పీడ్–ఓవర్‌లోడ్‌ నిషేధం, డ్రంక్ అండ్ డ్రైవ్‌ చేయరాదని ప్రజలకు సూచించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు.

News November 23, 2025

నిబద్ధత, సేవ భావంతో సేవలు అందించాలి: కలెక్టర్

image

ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు వచ్చే విధంగా నిబద్ధతతో సేవాభావంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థల శిక్షణ పొందుతున్న 16 మంది యువ ఐపీఎస్, యువ ఐఏఎస్‌లతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ.. పరిపాలనలో మానవీయ కోణంలో ప్రజలకు సేవలు అందించాలన్నారు.