News November 6, 2024
‘ఈనెల 18న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి’

తమ సమస్యలను పరిష్కరించాలని గూడూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు మెడికల్ ఆఫీసర్ ప్రత్యూషకు వినతిపత్రం ఇచ్చారు. సీఐటీయూ డివిజన్ కార్యదర్శి జే.మోహన్, ఆశా వర్కర్స్ యూనియన్ మండల నాయకురాలు శేషమ్మ మాట్లాడుతూ.. గతంలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను అమలు చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఈనెల 18న కర్నూలు కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని ఆశా వర్కర్లకు పిలుపునిచ్చారు.
Similar News
News October 27, 2025
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: SP

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. ఆదివారం జిల్లాలో నేరనియంత్రణ, శాంతిభద్రత కోసం అన్ని పోలీస్ స్టేషన్లలో రౌడీ, నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించండి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు.
News October 26, 2025
వర్గీకరణ మార్కింగ్ 29లోపు పూర్తి కావాలి: జిల్లా కలెక్టర్

భూ కమతాల వర్గీకరణ మార్కింగ్ ప్రక్రియను ఈనెల 29వ తేదీలోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సిరి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం మండల, డివిజన్ వ్యవసాయ శాఖ అధికారులతో భూకమతాల వర్గీకరణ, ఈ పంట నమోదు, పత్తి, ఉల్లి పంటల హార్వెస్టింగ్పై కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడువులోగా ఈ పంట నమోదు కూడా పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
News October 26, 2025
వర్గీకరణ మార్కింగ్ 29లోపు పూర్తి కావాలి: జిల్లా కలెక్టర్

భూ కమతాల వర్గీకరణ మార్కింగ్ ప్రక్రియను ఈనెల 29వ తేదీలోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సిరి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం మండల, డివిజన్ వ్యవసాయ శాఖ అధికారులతో భూకమతాల వర్గీకరణ, ఈ పంట నమోదు, పత్తి, ఉల్లి పంటల హార్వెస్టింగ్పై కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడువులోగా ఈ పంట నమోదు కూడా పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


