News July 18, 2024
ఈనెల 19న రైతు భరోసా.. హాజరు కానున్న డిప్యూటీ సీఎం

రైతులకు పెట్టుబడి సాయం పథకం అమలుపై కరీంనగర్ ఉమ్మడి జిల్లాల రైతుల అభిప్రాయం సేకరణ కార్యక్రమాన్ని ఈనెల 19న కరీంనగర్ శివారు బొమ్మకల్ గ్రామంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పమెలా సత్పత్తి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 28, 2025
కరీంనగర్: NMMSS ‘కీ’ విడుదల

8వ తరగతి విద్యార్థులకు ఈనెల 23న నిర్వహించిన NMMSS స్కాలర్ షిప్ అర్హత పరీక్ష KEY విడుదలైందని కరీంనగర్ DEO మొండయ్య తెలిపారు. కీ పేపర్ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 6 వరకు http/bse.telangana.gov.in సైట్లో లేదా dirgovexams.tg@gmail.comకి పంపాలని అన్నారు. లేదా డైరెక్టర్ ప్రభుత్వ పరీక్షలు, హైదరాబాద్ నందు సమర్పించాలని తెలిపారు. డిసెంబర్ 6 తరువాత వచ్చిన అభ్యంతరాలను స్వీకరించబడవని అన్నారు.
News November 28, 2025
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి: సీపీ

సర్పంచ్ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఇందులో భాగంగా గతంలో నేర చరిత్ర ఉన్న ఎన్నికల నేరస్థులను బైండోవర్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్నీ చర్యలు చేపడతామని, ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు.
News November 28, 2025
KNR: శిశుగృహ, బాలసదనం నుంచి పిల్లల దత్తత

పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ శిశు గృహంలో పెరుగుతున్న 4నెలల వయసున్న ఆడ శిశువును హుస్నాబాద్కు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు. బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న 13సం.ల బాలికను తమిళనాడుకు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా దంపతులకు పిల్లలను దత్తత ఇచ్చారు.


