News July 18, 2024
ఈనెల 19న రైతు భరోసా.. హాజరు కానున్న డిప్యూటీ సీఎం

రైతులకు పెట్టుబడి సాయం పథకం అమలుపై కరీంనగర్ ఉమ్మడి జిల్లాల రైతుల అభిప్రాయం సేకరణ కార్యక్రమాన్ని ఈనెల 19న కరీంనగర్ శివారు బొమ్మకల్ గ్రామంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పమెలా సత్పత్తి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 6, 2025
కరీంనగర్లో రెచ్చిపోతున్న ‘భూ’ బకాసురులు..!

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో భూ మాఫియా మళ్లీ రెచ్చిపోతుంది. భగత్ నగర్లోని ఓ స్థలాన్ని మాజీ కార్పొరేటర్ కబ్జా చేయగా లేక్ PS ముందు ఓ ఫ్లాట్లో నిర్మించిన గోడను కూల్చేశారు. రాంనగర్లోని పార్క్ స్థలమూ కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. అభిషేక్ మహంతి CPగా ఉన్నప్పుడు కబ్జాలపై వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఏర్పాటు చేసి భూ బకాసురులపై ఉక్కుపాదం మోపారు. CP మారడంతో ఆ కార్యక్రమాలు నిలిచిపోయాయి.
News December 5, 2025
ఎంఈవోలకు కరీంనగర్ కలెక్టర్ కీలక ఆదేశాలు

కరీంనగర్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఎంఈవోలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రతి పదవ తరగతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. ప్రత్యేక అధికారులు పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న స్పెషల్ క్లాసులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు స్లిప్ టెస్టులు నిర్వహిస్తూ బోర్డు పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో కనీసం 20 మంది పిల్లల ఉండాలన్నారు.
News December 5, 2025
వలస కూలీల పిల్లలను బడిలో చేర్చాలి: KNR కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో వలస కూలీలు, ఇటుక బట్టీల కార్మికుల పిల్లలను గుర్తించి ప్రత్యేక పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యాధికారులను ఆదేశించారు. పిల్లలకు రవాణా సాయం అందించాలని ఇటుక బట్టీల యజమానులను కోరారు. అలాగే, పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, స్పెషల్ క్లాస్లు పర్యవేక్షించి నూరు శాతం ఫలితాలు సాధించాలని సూచించారు.


