News October 21, 2024

ఈనెల 23న ఏయూ పాలకమండలి సమావేశం

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం ఈనెల 23న జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఉన్నత విద్యాశాఖకు అధికారులు పంపారు. వీసీ నియామకానికి సంబంధించి ఏయు నామిని పేరును ఈ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. దీంతో పాటు తాత్కాలికంగా ఆచార్యుల నియామకం, ప్రయోగశాల ఏర్పాటు, రెండు డిగ్రీల విధానం, పలు విభాగాలకు అవసరమైన కంప్యూటర్లు కొనుగోలు చేయడం, కంప్యూటరీకరణ దీనిలో చర్చించే అవకాశం ఉంది.

Similar News

News December 19, 2025

స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర (SASA) ప‌క్కాగా నిర్వ‌హించాలి: విశాఖ కలెక్టర్

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాల‌ను ప‌క్కాగా నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ అధికారుల‌ను ఆదేశించారు. ఈ నెల 3వ శనివారం విశాఖలో ‘పర్యావరణంలో అవకాశాలు’ అంశంపై విస్తృత కార్యక్రమాలు నిర్వహించాల‌ని సూచించారు. స్వయం సహాయక సంఘాలు (SHGలు), స్టార్టప్‌లు, స్థానిక వ్యాపారులు అభివృద్ధి చేసిన రీసైకిల్, అప్‌సైకిల్, పర్యావరణహిత ఉత్పత్తులను ప్రదర్శించాల‌న్నారు.

News December 19, 2025

బురుజుపేట: కనకమహాలక్ష్మి అమ్మవారికి సారె సమర్పణ

image

బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహోత్సవాల్లో అఖరి రోజు కావడంతో శుక్రవారం ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మహిళలు అమ్మవారికి పెద్ద ఎత్తున సారె సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈవో శోభారాణి అని ఏర్పాట్లు చేశారు. ఆలయావరణంలో ప్రత్యేక ప్రసాదం కౌంటర్లను అందుబాటులో ఉంచారు.

News December 19, 2025

విశాఖలో కిలో బీన్స్ పిక్కలు రూ.125

image

విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు శుక్రవారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. టమాటా రూ.46, ఉల్లి రూ.28, బంగాళదుంప రూ.13, వంకాయ రూ.42, బెండ రూ.54, మిర్చి రూ.44, బీరకాయ రూ.62, కాలిఫ్లవర్ రూ.26, కాకరకాయ రూ.60, చిలకడ దుంప రూ.34, దొండకాయ రూ.42, క్యారెట్ రూ.38, చిక్కుడుకాయ రూ.60, బీట్రూట్ రూ.34, పెన్సిల్ బీన్స్ రూ.50, బీన్స్ పిక్కలు రూ. 125, పొటల్స్ రూ.54, క్యాప్సికం రూ.44గా ఉన్నాయి.