News March 17, 2025
ఈనెల 23న కరీంనగర్కు కేటీఆర్..!

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 20న సూర్యాపేటలో, 23న కరీంనగర్లో ముఖ్యకార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారని BRS పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ సమావేశాల అనంతరం కేటీఆర్ వరుసగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేసి బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి దిశానిర్దేశం చేయనున్నారు.
Similar News
News March 18, 2025
నెలకు రూ.5,000.. UPDATE

యువతకు నైపుణ్యాన్ని అందించి ఉపాధి కల్పనే లక్ష్యంగా తీసుకొచ్చిన పీఎం ఇంటర్న్షిప్ పథకానికి కేంద్రం ప్రత్యేక మొబైల్ యాప్ను తీసుకొచ్చింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని ప్రారంభించారు. యువతను ఇందులో భారీగా చేరేలా ప్రోత్సహించాలని MPలకు సూచించారు. ఇంటర్న్కు ఎంపికైన వారికి ఏడాది పాటు నెలకు రూ.5వేలు ఇవ్వనున్నారు. ఈ పథకం <<15723056>>రెండో దశ దరఖాస్తు గడువును<<>> కేంద్రం ఈ నెల 31 వరకు పొడిగించింది.
News March 18, 2025
RCPM: చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడి మృతి

రామచంద్రపురం మండలం తాళ్లపొలం వద్ద బీరు ఫ్యాక్టరీ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయవరం మండలం వెంటూరుకు చెందిన యర్రగంటి శ్రీదత్త (28) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. రామచంద్రపురం నుంచి తాళ్లపొలం వైపు వెళ్తూ బీరు ఫ్యాక్టరీ దాటిన తర్వాత చెట్టును ఢీకొట్టాడు. గాయాలైన అతడిని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ద్రాక్షారామం పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 18, 2025
ప.గో జిల్లాకు కొత్త అధికారి

ప.గో జిల్లా DMHOగా డాక్టర్ జి. గీతాబాయి నియమితులయ్యారు. ఈ మేరకు ఆమెను నియమిస్తూ.. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎం. కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. పూర్వ డీఎంహెచ్వో డా. మహేశ్వరరావు గత ఏడాది డిసెంబరులో పదవీ విరమణ చేయగా.. అప్పటి నుంచి డా. బానూనాయక్ బాధ్యతలు చూసుకుంటున్నారు. గీతాబాయి నేడు బాధ్యతలు చేపట్టనున్నారు.