News March 17, 2025

ఈనెల 23న కరీంనగర్‌‌కు కేటీఆర్..!

image

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 20న సూర్యాపేటలో, 23న కరీంనగర్‌లో ముఖ్యకార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారని BRS పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ సమావేశాల అనంతరం కేటీఆర్ వరుసగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేసి బీఆర్‌ఎస్‌ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి దిశానిర్దేశం చేయనున్నారు.

Similar News

News March 18, 2025

వారికే రూ.4,00,000: సీఎం రేవంత్

image

TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు రుణం అందించేందకు రాజీవ్ యువవికాసం పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. <<15792006>>నిన్న దరఖాస్తుల ప్రక్రియ<<>> ప్రారంభమైంది. అర్హుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. నిజమైన నిరుద్యోగులకే ఈ పథకం అందాలని సూచించారు. ఐదంతస్తుల భవనం ఉన్నవారికి రూ.4 లక్షలు ఇస్తానంటే కుదరదని చెప్పారు. జూన్ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నారు.
వెబ్‌సైట్: tgobmms.cgg.gov.in

News March 18, 2025

నేడు ప్రధానితో సీఎం భేటీ

image

AP: CM చంద్రబాబు ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులతోపాటు పలు అంశాలపై PMతో చర్చించనున్నారు. అలాగే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి రావాల్సిందిగా మోదీని కోరనున్నట్లు సమాచారం. అనంతరం హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు.

News March 18, 2025

డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం

image

TG: లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం ఉండేలా డీలిమిటేషన్ ప్రక్రియ ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షతన నియోజక వర్గాల పునర్విభజనపై అసెంబ్లీ కమిటీ హాల్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని వివిధ పార్టీల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అఖిలపక్ష సమావేశంపై ప్రభుత్వానికి స్పష్టత లేదని కేటీఆర్ విమర్శించారు.

error: Content is protected !!