News July 23, 2024
ఈనెల 24, 25 తేదీల్లో స్పేస్ ఎగ్జిబిషన్: పి. శైలజ

సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆధ్వర్యంలో ఈనెల 24, 25 తేదీల్లో చౌడవరం ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులపాటు అంతరిక్ష వైజ్ఞానిక ప్రదర్శన (స్పేస్ ఎగ్జి బిషన్) ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ తెలిపారు. ప్రదర్శనలో రాకెట్ నమూనాలు, వివిధ ప్రయోగాలు, లాంచ్ ప్యాడ్ల ప్రదర్శనతోపాటు శాస్త్రవేత్తల ఉపన్యాసాలు ఉంటాయని తెలిపారు. 25వ తేదీ ఉదయం విద్యార్థులకు ప్రతిభా పరీక్ష ఉంటుందని తెలిపారు.
Similar News
News November 23, 2025
గుంటూరులో నాన్ వెజ్ ధరలు ఇవే.!

గుంటూరులో నేటి నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ ధర కేజీ రూ.200, విత్ స్కిన్ రూ.180గా విక్రయిస్తున్నారు. మటన్ కేజీ ధర రూ.1050 పలుకుతోంది. ఇక చేపలు బొచ్చెలు, రాగండి ఇలా రకాలను బట్టి కేజీ రూ.200 నుంచి రూ.280 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు మీ ప్రాంతాల్లో నాన్ వెజ్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News November 23, 2025
గుంటూరు: CCI పత్తి కొనుగోళ్లు ప్రారంభం

2025–26 సీజన్కు పత్తి కొనుగోళ్లు ప్రారంభించినట్టు CCI జనరల్ మేనేజర్ రాజేంద్ర షా శనివారం తెలిపారు. రాష్ట్రంలో 30 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. MSP కింద పత్తి అమ్మడానికి Kapas Kisan App ద్వారా స్లాట్బుక్ చేసుకోవాలని రైతులకు సూచించారు. తేమ 8% లోపు ఉంటే పూర్తి MSP, 8–12% మధ్య ఉంటే తగ్గింపులు ఉంటాయని తెలిపారు. సహాయం కోసం WhatsApp హెల్ప్లైన్ 7659954529 అందుబాటులో ఉందన్నారు.
News November 23, 2025
GNT: ఐటీసీ వద్ద కాల్వలో మృతదేహం కలకలం

నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐటీసీ వద్ద కాల్వలో మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. విధుల్లో ఉన్న రక్షక్ సిబ్బంది ఐటీసీ ప్రహరీగోడకు ఆనుకొని ఉన్న కాల్వలో మృతదేహాన్ని గుర్తించి స్థానికంగా ఆరా తీశారు. వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీకి తరలించారు. గుర్తుతెలియని మృతదేహానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


