News August 20, 2024

ఈనెల 25న నాగోల్ మెట్రో వద్ద ధర్నా

image

కనీస సౌకర్యాలు లేని నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉచిత పార్కింగ్ తొలగించడంతో ప్రయాణీకులకు ఆర్థిక భారం పెరుగుతుందని ఆవేదన చెందుతున్నారు. ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఆధ్వర్యంలో ఆగస్ట్ 25న ఉదయం 9 గంటలకు ఇక్కడ ధర్నా చేయనున్నట్టుగా తెలిపారు. వర్షానికి, ఎండకు వాహనాలకు రక్షణ కల్పించకుండా భారీగా వసూలు చేయడాన్ని నిరసిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Similar News

News November 27, 2025

CUA మహా మాస్టర్ ప్లాన్‌: 27 మున్సిపాలిటీలకు కొత్త చట్టాలు!

image

GHMCకి అనుబంధంగా ఉన్న 27 మున్సిపాలిటీల కోసం కోర్ అర్బన్ ఏరియా (CUA) మాస్టర్ ప్లాన్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే HMDA మాస్టర్ ప్లాన్ 2050, 56 గ్రామాలకు FCDA ప్లాన్‌లు పూర్తవగా నోటిఫికేషన్ ఈ వారమే విడుదల కానుంది. ఇక CUA ప్లాన్ కోసం, ప్రత్యేకంగా జోనల్ రెగ్యులేషన్స్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ రూల్స్‌ను రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. త్వరలో CMతో సమావేశమై చర్చించనున్నట్లు తెలిసింది.

News November 27, 2025

పాలకమండలి లేకపోవడం వల్లే ‘విలీనం’ ఈజీ

image

గ్రేటర్‌లో కలువనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుతం ఎటువంటి పాలక మండలి లేదు. సంవత్సరం క్రితమే పాలక మండళ్ల గడువు ముగిసింది. అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్లే పరిపాలన చేస్తున్నారు. విలీనాన్ని అడ్డుకునేందుకు గానీ, ప్రశ్నించేందుకు గానీ సభ్యులు ఎవరూ ఉండరు. అందుకే సర్కారు ఈ సమయం చూసి ఈ నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీలను విలీనం చేసినపుడు కూడా అదే పరిస్థితి.

News November 27, 2025

HYD: విషాదం..11 ఏళ్లకే సూసైడ్

image

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన వెలుగుచూసింది. సుభాష్‌నగర్‌లో నివాసం ఉండే బాలుడు(11) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుడు మృతదేహాన్ని పరిశీలించారు. సూసైడ్‌కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చిన్న వయసులో బాలుడి కఠిన నిర్ణయం స్థానికులను కలచివేసింది.