News March 23, 2025

ఈనెల 26న యాదాద్రి శ్రీవారి హుండీ ఆదాయం లెక్కింపు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తుల కానుక రూపంలో సమర్పించిన హుండీ ఆదాయాన్ని ఈనెల 26న లెక్కించనున్నట్లు ఆదివారం ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. కొండ కింద శ్రీసత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఉదయం ఏడు గంటలకు ఆలయ సిబ్బంది, వాలంటీర్లచే, భద్రత సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో ఉండి లెక్కింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News September 15, 2025

సీఎంకు అనకాపల్లి కలెక్టర్ విజ్ఞప్తి

image

అనకాపల్లి జిల్లాలో పశుసంపద, పువ్వులు, కూరగాయల సాగుకు ప్రోత్సాహం అందించాలని కలెక్టర్ విజయకృష్ణన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో పాల్గొని జిల్లా అభివృద్ధి నివేదికను అందజేశారు. ప్రతి ఇంటికి ఒకటికంటే ఎక్కువ పశువులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఉత్తమ జాతి పశువులను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేందుకు రాయితీ అందించాలన్నారు.

News September 15, 2025

వనపర్తి: మహిళలు, పిల్లల ఆరోగ్యానికి ‘స్వస్థ నారీ, సశక్తి పరివార్’: కలెక్టర్

image

మహిళలు, పిల్లలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వస్థ నారీ, సశక్తి పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలతో మహిళలు, పిల్లల సాధికారత సాధించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.

News September 15, 2025

విశాఖలో 15 హోటల్స్‌పై క్రిమినల్ కేసులు

image

గత నెల ఒకటి రెండు తేదీల్లో ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో 81 హోటల్స్‌లో శాంపిల్స్ సేకరించి ఫుడ్ ల్యాబరేటరీకి పంపించారు. వీటి ఫలితాలు రావడంతో 15 హోటల్స్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామని మరో 14 హోటల్స్‌పై జేసి కోర్టులో జరిమానా విధిస్తున్నట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కళ్యాణ్ చక్రవర్తి ఓ ప్రకటనలో తెలిపారు. హోటల్స్ యజమానులు ఫుడ్ సేఫ్టీ ప్రకారం నాణ్యత పాటించాలన్నారు.