News March 23, 2025
ఈనెల 26న యాదాద్రి శ్రీవారి హుండీ ఆదాయం లెక్కింపు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తుల కానుక రూపంలో సమర్పించిన హుండీ ఆదాయాన్ని ఈనెల 26న లెక్కించనున్నట్లు ఆదివారం ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. కొండ కింద శ్రీసత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఉదయం ఏడు గంటలకు ఆలయ సిబ్బంది, వాలంటీర్లచే, భద్రత సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో ఉండి లెక్కింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 22, 2025
తిరుపతి: యువకుడి జోబిలో పేలిన ఫోన్

తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చిట్టత్తూరు పంచాయతీ కొత్త కండ్రిగకు చెందిన నరసింహారెడ్డి(36) పిడుగుపాటుకు గురైన విషయం విధితమే. నరసింహారెడ్డి తన పొలంలో కూలీల చేత వరినాట్లు నాటించాడు. వర్షం వస్తుండడంతో గొడుగు వేసుకుని నిలబడి ఉండగా సమీపంలోనే పిడుగు పడింది. దీంతో అతని ఫ్యాంట్లోని ఫోన్ పేలింది. తొడ భాగం పూర్తిగా కాలిపోవడంతో మెరుగైన చికిత్స కోసం వేలూరు హాస్పిటల్కు తరలించారు. వర్షంలో తస్మాత్ జాగ్రత్త.
News November 22, 2025
MDK: రూ.లక్ష ఆదాయం వస్తుంది..!

సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మల్బరీ తోటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పట్టుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, రైతులు కొద్దిగా కష్టపడితే ఎకరానికి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుందని చెప్పారు. ప్రభుత్వాలు అందిస్తోన్న ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ సోమేశ్వర్ రావు తెలిపారు.
News November 22, 2025
SERP పనితీరుపై మంత్రి కొండపల్లి సమీక్ష

SERP పనితీరుపై అమరావతి సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) పనితీరు, రైతుల కోసం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ల ఏర్పాటు అంశాలపై చర్చించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు రూ.16,846 కోట్లు రుణాలు మంజూరయ్యాయని, 2026 మార్చి నాటికి రూ.32,322 కోట్లు అందేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.


