News March 23, 2025
ఈనెల 26న యాదాద్రి శ్రీవారి హుండీ ఆదాయం లెక్కింపు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తుల కానుక రూపంలో సమర్పించిన హుండీ ఆదాయాన్ని ఈనెల 26న లెక్కించనున్నట్లు ఆదివారం ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. కొండ కింద శ్రీసత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఉదయం ఏడు గంటలకు ఆలయ సిబ్బంది, వాలంటీర్లచే, భద్రత సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో ఉండి లెక్కింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 18, 2025
అధికారులు నిద్రావస్థలో ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యం: MP

జిల్లా అధికారులు నిద్రావస్థలో ఉంటే అభివృద్ధి ఎలా జరుగుతుందని ఎంపీ కడియం కావ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో దిశ ప్రోగ్రాం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోకపోవడం అందుకు తగిన విధంగా అధికారులు పనిచేయకపోవడం, శోచనీయమన్నారు. జిల్లాకు మంజూరైన 6 పల్లె దవాఖానాలు ముందుకు వెళ్లలేదని, దీంతో నిధులు వెనక్కి వెళ్తున్నట్లు పేర్కొన్నారు.
News November 18, 2025
అధికారులు నిద్రావస్థలో ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యం: MP

జిల్లా అధికారులు నిద్రావస్థలో ఉంటే అభివృద్ధి ఎలా జరుగుతుందని ఎంపీ కడియం కావ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో దిశ ప్రోగ్రాం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోకపోవడం అందుకు తగిన విధంగా అధికారులు పనిచేయకపోవడం, శోచనీయమన్నారు. జిల్లాకు మంజూరైన 6 పల్లె దవాఖానాలు ముందుకు వెళ్లలేదని, దీంతో నిధులు వెనక్కి వెళ్తున్నట్లు పేర్కొన్నారు.
News November 18, 2025
అల్లూరి: ‘చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి’

రచనల ద్వారా సమాజంలో చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి కనకదాసు అని కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. భక్త కనకదాసు ఒక గొప్ప కవిగా, తత్వవేత్తగా, అపారమైన సామాజిక సంస్కర్తగా అందించిన సేవలను దేశం స్మరించుకుంటోందన్నారు. మంగళవారం భక్త కనకదాసు జయంతిని కలెక్టరేట్లో నిర్వహించారు. అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కనకదాసు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


