News March 19, 2025

ఈనెల 26 నుంచి అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు

image

రాజంపేట మండలం తాళ్లపాక అన్నమయ్య ధ్యాన మందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు 522 వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రామ్ అధికారిని హేమలత తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో నగర సంకీర్తన, సప్తగిరిల సంకీర్తన, గోష్టి గానం, అన్నమాచార్య సంకీర్తనలు, హరికథ, శ్రీరామ పాదుకలు నాటకం ఉంటుందని తెలిపారు.

Similar News

News January 11, 2026

KNR: ప్రత్యేక రైలు రేపటి వరకు పొడిగింపు

image

HYD-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే ఫెస్టివల్ స్పెషల్ రైలును మరో 2 రోజులు పొడిగించారు. ముందుగా ఈ నెల 9, 10వ తేదీల్లో ప్రత్యేక రైలు నడిపిస్తుండగా.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 11, 12 తేదీల్లో కూడా నడపిస్తున్నారు. HYD – సిర్పూర్ కాగజ్‌నగర్(07473) మధ్య 11, 12వ తేదీల్లో ఉ. 7-55 గం.లకు బయలుదేరి మ. 2-15గం.లకు చేరుకుంటుంది. ఉమ్మడి KNRలో ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రామగుండం స్టేషన్లో ఆగుతుంది.

News January 11, 2026

మన పల్నాడే పందేం కోళ్లకు అసలైన కేరాఫ్!

image

కోడి పందేలు అనగానే APలోని ఉభయగోదావరి జిల్లాలు గుర్తుకొస్తాయి. అయితే కోడి పందేలు చరిత్ర శతాబ్దాల వెనక్కి వెళ్లితే ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాటి వీరగాథ ముందుకొస్తుంది. కోడి పందేలే కారణంగా పల్నాడు యుద్ధంలో రక్తపాతం జరిగింది. సామాజిక విభేదాలు, అధికార పోరాటాలు కోడి పందేల చుట్టూ ముదిరి చరిత్రలో చెరగని ముద్ర వేశాయి. సంక్రాంతి సందర్భంగా జిల్లాలో కోడి పందేలు చరిత్రగా, ఒక రకంగా సంప్రదాయంగా ఉన్నాయి.

News January 11, 2026

ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ‘దిత్వా’

image

బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కనిపిస్తోంది. శనివారం ఉదయం నుంచి అక్కడక్కడ చిరుజల్లులు పడుతుండడంతో.. రైతుల్లో భయందోళన మొదలైంది. జిల్లాలో మిర్చి సుమారు 50వేల ఎకరాలపైగా కాతపూత దశలో ఉంది. మొక్కజొన్న లక్షన్నరపైగా ఎకరాల్లో సాగులో ఉంది. వర్షం పడితే మిర్చి, మొక్కజొన్న రైతులు భారీగా నష్టపోయే పరిస్థితి ఉంది. అటు పండుగ సంబురాలకు కూడా వర్షం ఆటంకం కలిగించనుంది.