News April 24, 2024
ఈనెల 26 లోగా దరఖాస్తు చేయాలి: కలెక్టర్

ఎన్నికల అధికారులు సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం ఈ నెల 26వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేయాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఫారం-12 దరఖాస్తుకు ఎన్నికల గుర్తింపు కార్డు ఎన్నికల విధుల నియామక పత్రం జతచేసి నోడల్ అధికారి ద్వారా వారు పనిచేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం సహాయ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని సూచించారు.
Similar News
News December 12, 2025
జీవీఎంసీ టౌన్ ప్లానింగ్లో 19 ఫిర్యాదులు

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమంలో 19 వినతులు వచ్చాయని చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకారరావు తెలిపారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సీపీలు, డీసీపీలు, ఏసీపీలతో కలిసి ప్రత్యేకంగా టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవీఎంసీ పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు చీఫ్ సిటీ ప్లానర్ చెప్పారు.
News December 12, 2025
విశాఖలో సత్వా వాంటెజ్ సంస్థకు శంకుస్థాపన

దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కన్సల్టింగ్ సంస్థ అయిన సత్వా వాంటెజ్ క్యాంపస్ను ఐటీ శాఖ మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. రూ.1500 కోట్ల పెట్టుబడితో 3 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ క్యాంపస్లో 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, పరోక్షంగా 50 వేల మంది వరకు ఉపాధి పొందుతారని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
News December 12, 2025
ఐటీ హిల్స్లో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

మధురవాడ ఐటీ హిల్స్ ప్రాంగణంలో కాగ్నిజెంట్ కంపెనీ శాశ్వత భవనాల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఆయనకు నగర ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, గణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ ఎం.ఎన్ హరేంధిర ప్రసాద్ స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.


