News July 23, 2024
ఈనెల 27న విశాఖ జడ్పీ సర్వసభ్య సమావేశం

ఈ నెల 27న జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఎం.పోలినాయుడు మంగళవారం తెలిపారు. ఆరోజు ఉదయం 10.30గంటలకు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి నివేదికలకు సంబంధించిన పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు.
Similar News
News November 22, 2025
కంచరపాలెం రైతుబజారుకు ‘బాహుబలి’ క్యారెట్

కంచరపాలెం రైతు బజార్కు 880 గ్రాములు క్యారేట్ను ఓ మహిళ రైతు తీసుకొచ్చింది. ఈ క్యారేట్ను వినియోగదారులు, ప్రజలు అందరూ వింతగా చూస్తూ వారి సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకున్నారు. అయితే రైతు బజార్లో కేజీ క్యారెట్ రూ.60 ఉండడంతో ఈ ఒక్క క్యారెట్ రూ.53 ధర పలికింది. అయితే గతంలో చాలాసార్లు కాయగూరలు ఇటువంటి పరిమాణంలో రావడం జరిగిందని అధికారులు తెలిపారు.
News November 22, 2025
విశాఖ: పసికందు హత్య కేసులో వీడని మిస్టరీ

తాటిచెట్లపాలెంలో పసికందును క్రూరంగా హత్య చేసి శరీర భాగాలను వేరు చేసి కాల్వలో పడేసిన విషయం పాఠకులకు విధితమే. కాగా ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎటువంటి కీలక ఆధారాలు లభించలేదు. అంతేకాకుండా మృతురాలి తలభాగం కూడా ఇప్పటిదాకా లభ్యం కాలేదు. కొండపై ఎవరైనా అనుమానితులు సంచరిస్తున్నార అన్న అనుమానంతో డ్రోన్లతో నిఘా పెట్టారు. ఆరోజు రాత్రి నుంచి వేకువజాము వరకు ఆ రోడ్డులో ప్రయాణించిన వారిని విచారిస్తున్నారు.
News November 22, 2025
వేట నిషేధ సమయంలో రూ.20 వేల సాయం: గంటా

బతుకు తెరువు కోసం ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రభుత్వం ఆసరాగా ఉంటుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా చేపల తిమ్మాపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల ఉపాధికి ఇబ్బంది కలుగకుండా ఏడాదికి రూ.20 వేల చొప్పున 12,130 మందికి రూ.25 కోట్ల సాయాన్ని అందించామని తెలిపారు.


