News March 26, 2025
ఈనెల 28న ఏలూరు కలెక్టరేట్లో ఇఫ్తార్ విందు

ఏలూరు కలెక్టరేట్ గిరిజన భవన్లో ఈనెల 28వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు ముస్లిం మైనారిటీస్ ఆధ్వర్యంలో, ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా.. ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మంగళవారం ఆమె పేర్కొన్నారు. కనుక ఏలూరు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ముస్లిం మత పెద్దలు, ఇఫ్తార్ విందుకు రావాలని కలెక్టర్ కోరారు.
Similar News
News December 17, 2025
వీణవంక సర్పంచ్గా దాసరపు సరోజన విజయం

వీణవంక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని దాసరపు సరోజన రాజేంద్రప్రసాద్ ఘనవిజయం సాధించారు. బుధవారం జరిగిన హోరాహోరీ పోరులో ఆమె తన సమీప ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి విజేతగా నిలిచారు. తన గెలుపునకు సహకరించిన ఓటర్లందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో వీణవంకను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా సరోజన హామీ ఇచ్చారు.
News December 17, 2025
మెస్సీకి అంబానీ గిఫ్ట్.. ఖరీదు ఎంతో తెలుసా?

అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ నిన్న గుజరాత్లోని <<18586214>>వనతార<<>>ను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెస్సీకి అనంత్ అంబానీ అరుదైన బహుమతి ఇచ్చారు. రిచర్డ్ మిల్లీ RM 003 V2 వాచ్ను బహూకరించారు. దీని విలువ దాదాపు రూ.10.91 కోట్లు కావడం గమనార్హం. ఈ లిమిటెడ్ ఆసియా ఎడిషన్ వాచ్లు ప్రపంచంలో 12 మాత్రమే ఉన్నాయి. ‘గోట్ టూర్’లో భాగంగా ఈ నెల 13-16 తేదీల్లో ఇండియాలో మెస్సీ పర్యటించారు.
News December 17, 2025
భద్రాద్రి: ‘జగన్’పై ‘చంద్రబాబు’ విజయం

జూలూరుపాడు మండలం గుండ్లరేవు పంచాయతీ ఎన్నిక ఫలితం జిల్లావ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ సర్పంచ్ పదవి కోసం కాంగ్రెస్ మద్దతుదారు చంద్రబాబు, తన సమీప ప్రత్యర్థి జగన్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో చంద్రబాబు ఘన విజయం సాధించి విజయకేతనం ఎగురవేశారు. రాష్ట్ర రాజకీయాల్లోని ప్రముఖ నాయకుల పేర్లతో ఉన్న అభ్యర్థులు ఇక్కడ తలపడటంతో ఈ పోరు మొదటి నుంచీ అత్యంత ఆసక్తికరంగా మారింది.


