News March 26, 2025
ఈనెల 28న ఏలూరు కలెక్టరేట్లో ఇఫ్తార్ విందు

ఏలూరు కలెక్టరేట్ గిరిజన భవన్లో ఈనెల 28వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు ముస్లిం మైనారిటీస్ ఆధ్వర్యంలో, ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా.. ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మంగళవారం ఆమె పేర్కొన్నారు. కనుక ఏలూరు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ముస్లిం మత పెద్దలు, ఇఫ్తార్ విందుకు రావాలని కలెక్టర్ కోరారు.
Similar News
News November 5, 2025
కరీంనగర్: గ్రామీణ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

KNR జిల్లా తిమ్మాపూర్లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీలో పురుషుల నుంచి ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ.సంపత్ తెలిపారు. ఉమ్మడి KNR జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 18 నుంచి 45 సంవత్సరాలున్న పురుషులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు Nov9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వివరాలకు తమను సంప్రదించవచ్చన్నారు. SHARE IT.
News November 5, 2025
రజినీకాంత్-కమల్ హాసన్ మల్టీస్టారర్!

మరోసారి రజినీకాంత్-కమల్ హాసన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు కోలీవుడ్లో టాక్ నడుస్తోంది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో ఈ మూవీ ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రజినీ తన తర్వాతి రెండు మూవీస్ కమల్ ప్రొడక్షన్లోనే చేయబోతున్నారట. మొదటిది సుందర్ సి దర్శకత్వంలో, రెండోది నెల్సన్ డైరెక్షన్లో ఈ మల్టీస్టారర్ ఉండబోతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు.
News November 5, 2025
శ్రీశైలంలో పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ

శ్రీశైలంలో ఇవాళ జరిగే జ్వాలాతోరణం, ఈనెల 14న జరిగే కోటి దీపోత్సవానికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ పేర్కొన్నారు. నేడు జిల్లా వ్యాప్తంగా జరిగే కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. పుణ్యస్నానాలు ఆచరించే చోట పోలీసుల ఆదేశాలు, సూచనలను భక్తులు తప్పనిసరిగా పాటించాలన్నారు.


