News March 26, 2025

ఈనెల 28న ఏలూరు కలెక్టరేట్‌లో ఇఫ్తార్ విందు

image

ఏలూరు కలెక్టరేట్ గిరిజన భవన్‌లో ఈనెల 28వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు ముస్లిం మైనారిటీస్ ఆధ్వర్యంలో, ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా.. ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మంగళవారం ఆమె పేర్కొన్నారు. కనుక ఏలూరు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ముస్లిం మత పెద్దలు, ఇఫ్తార్ విందుకు రావాలని కలెక్టర్ కోరారు.

Similar News

News July 5, 2025

NRPT: అథ్లెటిక్స్ ఆడెందుకు బయలుదేరిన క్రీడాకారులు

image

తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఆడిందుకు నారాయణపేట జిల్లా క్రీడాకారులు శనివారం బయలుదేరారు. హనుమకొండలో రేపటి నుంచి ప్రారంభమయ్యే “Trithalon అథ్లెటిక్స్” అండర్-10, 12, 14 విభాగంలో 60 మీ. రన్నింగ్, లాంగ్ జంప్, జావిలిన్ త్రో తదితర క్రీడల్లో 20 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. మండల విద్యాధికారి కృష్ణారెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రెటరీ రమణ బెస్ట్ విషెస్ తెలిపారు.

News July 5, 2025

నాగర్‌కర్నూల్‌లో రేబిస్ వ్యాధి టీకాలు

image

ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా జిల్లా పశువైద్యశాఖ ఆధ్వర్యంలో రేబిస్ వ్యాధి నివారణ టీకా కార్యక్రమం ఆదివారం నిర్వహించనున్నారు. ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నాగర్‌కర్నూల్ పశువైద్యశాలలో ఈ టీకాలు వేయనున్నట్లు అని జిల్లా పశువైద్యశాఖ అధికారి జ్ఞానశేఖర్ తెలిపారు. శునకాల ప్రేమికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ పెంపుడు కుక్కలకు టీకాలు వేయించుకోవాలని ఆయన సూచించారు.

News July 5, 2025

దారుణం: కత్తితో పొడిచి.. తాళి కట్టి.. సెల్ఫీ దిగి

image

కర్ణాటకలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతికి తాళి కట్టాడు. మైసూర్‌కు చెందిన పూర్ణిమ (36) టీచర్. అభిషేక్ ప్రేమ పేరుతో ఆమె వెంటపడేవాడు. ఇవాళ ఆమెను కత్తితో పొడిచాడు. యువతి స్పృహ తప్పి కిందపడిపోగానే మెడలో తాళి కట్టాడు. ఆపై సెల్ఫీ తీసుకుని మురిసిపోయాడు. తర్వాత అతడే ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో పారిపోయాడు. పూర్ణిమ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది.