News July 25, 2024
ఈనెల 28న నరవ ఐటిఐలో కౌన్సిలింగ్

నరవ ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 28న ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ జరగనున్నట్లు ప్రిన్సిపల్ కె.ఎస్. శ్రీనివాసరావు తెలిపారు. రెండో విడత కౌన్సెలింగ్లో సీట్ల భర్తీకి అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తుల చేసుకున్న గడువు బుధవారంతో ముగిసిందన్నారు. ఎలక్ట్రిషియన్, ఫిట్టరు, ఎలక్ట్రానిక్, మెకానిక్, డీజిల్ మెకానిక్ ట్రేడులలో సంబంధించి దరఖాస్తు చేసిన అభ్యర్థులంతా కౌన్సెలింగ్ రోజున అన్ని ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు.
Similar News
News December 12, 2025
ఐటీ హిల్స్లో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

మధురవాడ ఐటీ హిల్స్ ప్రాంగణంలో కాగ్నిజెంట్ కంపెనీ శాశ్వత భవనాల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఆయనకు నగర ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, గణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ ఎం.ఎన్ హరేంధిర ప్రసాద్ స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
News December 12, 2025
విశాఖలో టెక్ తమ్మిన సంస్థకు మంత్రి లోకేష్ శంకుస్థాపన

విశాఖ మధురవాడలోని హిల్ నెంబర్-2లో టెక్ తమ్మిన ఐటీ సంస్థ క్యాంపస్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శుక్రవారం భూమిపూజ చేశారు. టెక్ తమ్మిన సంస్థ విశాఖ యూనిట్ ద్వారా రూ.62 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 500 మందిగి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. నెదర్లాండ్స్,దుబాయ్,ఇండియాలో తన సేవలను అందిస్తోంది. ఈ కార్యక్రమంలో సీఈవో రాజ్ తమ్మిన,ఎంపీ భరత్ ఉన్నారు.
News December 12, 2025
పూర్వ విద్యార్థుల సమావేశానికి సిద్ధమవుతున్న AU

ఆంధ్ర విశ్వవిద్యాలయం వార్షిక పూర్వ విద్యార్థుల సమావేశం 2025కు సిద్ధమైంది. శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి బీచ్ రోడ్లోని ఏయు కన్వెన్షన్ సెంటర్ వేదికగా కార్యక్రమం జరగనుంది. శతాబ్ది సంవత్సరంలో జరుగుతున్న ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. సంఘం వ్యవస్థాపక చైర్మన్ జి.ఎం రావు తదితరులు పాల్గొంటారు. వర్సిటీ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.


