News March 27, 2025
ఈనెల 28న పాడేరు పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా

పాడేరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఈనెల 28వ తేదీన జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిణి డాక్టర్ పి.రోహిణి బుధవారం తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్ మేళాలో పలు కార్పొరేట్ కంపెనీలు పాల్గొని, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయన్నారు. పది, జీఎన్ఎం, ఏఎన్ఎం, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Similar News
News December 20, 2025
కామారెడ్డి జిల్లాకు నూతన DCCB?

నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లి., పర్సన్ ఇన్ఛార్జ్గా కలెక్టర్ను నియమిస్తూ రాష్ట్ర సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం కలెక్టర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా ఉమ్మడి జిల్లాకు చెందిన DCCBని రెండు జిల్లాలకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో KMR జిల్లాలో నూతన DCCB ఏర్పాటు కానున్నట్లు సమాచారం.
News December 20, 2025
ASF: పంచాయతీ పోరులో సగం.. సత్తా చాటిన మహిళలు

ASF జిల్లాలో 3 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మహిళలు సత్తా చాటారు. మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. వారికి కేటాయించిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీపడ్డారు. జిల్లాలో 332 గ్రామ పంచాయతీలలో జరిగిన ఎన్నికల్లో 170 మంది మహిళ సర్పంచ్లు గెలుపొందారు. మొదటి విడతలో 60 మంది, 2వ విడతలో 54, 3వ విడతలో 56 మహిళలు ఎన్నికయ్యారు.
News December 20, 2025
కామారెడ్డి: లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలి

కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్లు పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులు, బీడీ కార్మికులు, ఇతర కంపెనీల్లో పనిచేసి పదవి విరమణ పొంది పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్లు ఈ నెలాఖరులోగా అందజేయాలని ఉమ్మడి జిల్లా ప్రాంతీయ భవిష్య నిధి కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఇప్పటి వరకు లైఫ్ సర్టిఫికెట్లు అందజేయనివారు మీసేవా కేంద్రాల్లో అందజేయాలన్నారు.


