News March 27, 2025

ఈనెల 28న పాడేరు పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా

image

పాడేరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఈనెల 28వ తేదీన జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిణి డాక్టర్ పి.రోహిణి బుధవారం తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్ మేళాలో పలు కార్పొరేట్ కంపెనీలు పాల్గొని, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయన్నారు. పది, జీఎన్ఎం, ఏఎన్ఎం, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Similar News

News December 15, 2025

చిన్నారుల్లో ఊబకాయాన్ని ముందే గుర్తించొచ్చు

image

ప్రస్తుతం చిన్నారుల్లోనూ ఊబకాయం ముప్పు పెరుగుతోంది. దీన్ని ముందే గుర్తించేందుకు సైంటిస్టులు పాలీజెనిక్‌ రిస్క్‌ స్కోర్‌ టెస్ట్‌ని క్రియేట్‌ చేశారు. దీనికోసం 50లక్షలకు పైగా జెనెటిక్‌ డేటాలను పరిశీలించారు. 5ఏళ్లలోపు పిల్లలకు పరీక్ష చేసి వచ్చిన స్కోర్‌‌తో ఫ్యూచర్‌లో ఒబెసిటీ వచ్చే ప్రమాదాన్ని గుర్తించొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో పిల్లల జీవనశైలిలో మార్పులు చేసి ఒబెసిటీ బారిన పడకుండా చూడొచ్చు.

News December 15, 2025

కవ్వాల్‌లో ఆధార్ స్పెషల్ క్యాంప్ ప్రారంభం

image

జన్నారం మండలం కవ్వాల్ గ్రామపంచాయతీలో అత్యవసర ఆధార్ ప్రత్యేక శిబిరం సోమవారం ప్రారంభమైంది. మంగళవారం కూడా కొనసాగుతుందని జన్నారం పోస్టల్ శాఖ ఏఎస్పీ రామారావు తెలిపారు. ఈ శిబిరంలో ప్రజలు తమ ఆధార్ కార్డుల్లోని తప్పుల సవరణ, ఫొటో అప్‌డేట్, చిరునామా, ఫోన్ నంబర్, పుట్టిన తేదీ మార్పులు వంటి అన్ని ముఖ్య సేవలను తక్షణమే వినియోగించుకోవాలని ఆయన కోరారు.

News December 15, 2025

మెస్సీ టూర్‌పై బింద్రా కీలక వ్యాఖ్యలు

image

ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ <<18570934>>ఇండియా టూర్‌<<>>పై ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. మెస్సీని విమర్శించడం తన ఉద్దేశం కాదని, ఆయన ప్రయాణం కోట్ల మందికి ఇన్స్పిరేషన్ అని తెలిపారు. అయితే తాత్కాలిక ప్రదర్శనలు, ఫొటోల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడంపై విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెడుతున్న శ్రద్ధలో కొంచెమైనా గ్రామీణ స్థాయిలో క్రీడల అభివృద్ధిపై పెడితే బాగుంటుందన్నారు.