News February 27, 2025
ఈనెల 28న సైన్స్ కార్యక్రమాలు నిర్వహించాలి: DEO

జాతీయ వైజ్ఞానిక దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 28న పెద్దపల్లి జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో సృజనాత్మకత సైన్స్ కార్యక్రమాలు నిర్వహించాలని DEO మాధవి తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, ఉపన్యాస, చిత్రలేఖన పోటీలు, సైన్స్ శాస్త్రవేత్తలు- వారి ఆవిష్కరణ, ప్రయోగ ప్రదర్శనలు తదితర అంశాలలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి రవినందన్ రావును సంప్రదించాలన్నారు.
Similar News
News March 21, 2025
మార్చి21: చరిత్రలో ఈరోజు

*1916: సెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జననం *1933: పేరిణి శివతాండవ నాట్యచారుడు నటరాజ రామకృష్ణ జననం *1970: హీరోయిన్ శోభన జననం *1978: ప్రముఖ సినీనటి రాణి ముఖర్జీ జననం
ప్రపంచ అటవీ దినోత్సవం
ప్రపంచ కవితా దినోత్సవం
ప్రపంచ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం
News March 21, 2025
గద్వాల: సుంకేసుల డ్యామ్ను పరిశీలించిన కలెక్టర్

తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని, ప్రాజెక్టు పనితీరును జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ గురువారం పరిశీలించారు. అనంతరం రాజోలి గ్రామ సమీపాన ఉన్న సుంకేసుల బ్యారేజిని సందర్శించి, నీటి నిల్వ సామర్థ్యంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో.. తహశీల్దార్ రామ్మోహన్, ఎస్ఐ జగదీశ్వర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దస్తగిరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
News March 21, 2025
వనపర్తిలో వ్యక్తికి జైలు శిక్ష

ప్రజలు ఎవరూ కూడా మద్యం తాగి వాహనాలు నడపవద్దని వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్ రెడ్డి అన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో వనపర్తికి చెందిన రమేశ్ నాయక్ అనే వ్యక్తిని గురువారం కోర్టులో హాజరు పరచగా.. అతడికి కోర్టు 6 రోజుల జైలు శిక్ష విధించామని తెలిపారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలను నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.