News October 27, 2024

ఈనెల 29న యాదాద్రి హుండీ లెక్కింపు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తుల కానుక రూపంలో సమర్పించిన హుండీ ఆదాయాన్ని ఈనెల 29న లెక్కించనున్నట్లు ఆదివారం ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఉదయం 7 గంటలకు ఆలయ సిబ్బంది, వాలంటీర్లు, భద్రత సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో హుండీలు లెక్కింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 22, 2025

NLG: వాట్సప్‌తో ఇక మీ సేవలు..!

image

నల్గొండ జిల్లా ప్రజలకు అతి ముఖ్యమైన మీ-సేవ సేవలు మరింత సులభతరమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీలో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. జిల్లాలో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా అన్ని రకాల అవసరాల కోసం వివిధ సర్టిఫికెట్స్ పొందడానికి ఇక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా మీ సేవలను వాట్సాప్ ద్వారా పొందే అవకాశం కల్పిస్తోంది. ఇటీవల మంత్రి శ్రీధర్ బాబు కొత్త డిజిటల్ సేవలను ప్రారంభించారు.

News November 22, 2025

NLG: తూతూ మంత్రంగా యువజన ఉత్సవాలు

image

యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతియేటా యువజన ఉత్సవాలను నిర్వహిస్తోంది. నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా మంచి అవకాశాలకు యువత దూరం అవుతున్నది. యువజన ఉత్సవాలపై ముందుగానే జిల్లాలోని అన్ని ప్రాంతాల యువతకు సమాచారం చేయవలసిన బాధ్యత యువజన క్రీడలశాఖపై ఉన్నా.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సమాచారం తమకు అందలేదని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News November 22, 2025

NLG: ‘ఉచిత మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోండి’

image

నల్గొండ జిల్లాలోని ఎస్సీ విద్యార్థులు వెంటనే ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీడీడీ (SCDD) డిప్యూటీ డైరెక్టర్ శశికళ కోరారు. 9, 10 తరగతులు చదువుతున్న పేద దళిత విద్యార్థులకు ఈ పథకం ద్వారా రూ. 3,500 బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయని ఆమె తెలిపారు. అర్హులైన 3080 మంది విద్యార్థులు మీ-సేవ ద్వారా క్యాస్ట్, ఇన్‌కమ్, ఆధార్ వివరాలతో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.