News January 2, 2025
ఈనెల 3న పార్వతీపురం జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన

ఈనెల 3వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన డీవీఎంఎం ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు డీఈవో ఎన్.తిరుపతి నాయుడు తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న సైన్స్ ఎగ్జిబిషన్లో జిల్లావ్యాప్తంగా ఉన్న 15 మండలాల నుంచి ఎంపికైన దాదాపు 45 సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శిస్తారన్నారు. కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హాజరవుతారని తెలిపారు.
Similar News
News November 10, 2025
కార్పొరేషన్ల డైరెక్టర్లుగా విజయనగరం నేతలకు అవకాశం

జిల్లాకు చెందిన పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను వివిధ కార్పొరేషన్లకు రాష్ట్ర డైరెక్టర్లుగా నియమిస్తూ కూటమి ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది.
> రమణాజీ& బంగారునాయుడు-దాసరి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్(ఎస్.కోట)
> మల్లేశ్వరావు-కలింగ కోమటి(విజయనగరం)
> కాళ్ల సత్యవతి&కొండల శ్రీనివాస్-నాగవంశం(నెల్లిమర్ల)
> సుంకరి సాయి రమేశ్-కళింగ వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్ డైరెక్టర్(బొబ్బిలి)
News November 9, 2025
మైనార్టీ వెల్ఫేర్ డే కు ఏర్పాట్లు పూర్తి: VZM కలెక్టర్

జనాబ్ మౌలానా అబుల్ కలాం అజాద్ జన్మదినం సందర్భంగా రేపు విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు మైనారిటీ వెల్ఫేర్ డే & జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మైనారిటీ వర్గాలకు చెందిన ప్రముఖులు, అధికారులు పాల్గొంటారన్నారు.
News November 9, 2025
అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలి: VZM కలెక్టర్

ప్రజల సమస్యల పరిష్కారార్థం రేపు (సోమవారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రజలు తమ వివరాలతో పాటు అర్జీలను సమర్పించాలని సూచించారు. అర్జీల స్థితి కోసం కాల్ సెంటర్ 1100 ద్వారా సమాచారం తెలుసుకోవాలన్నారు.


