News March 28, 2025
ఈనెల 30 నుంచి తలంబ్రాల బుకింగ్ ప్రారంభం

భద్రాచలంలో జరిగే శ్రీ రామనవమి సందర్భంగా ముత్యాల తలంబ్రాలు బుకింగ్ ప్రక్రియ ఈనెల 30 నుంచి ప్రారంభం కానుంది. భక్తులు దేవస్థాన అధికారిక వెబ్ సైట్ www.bhadradritemple. telangana.gov.in ద్వారా తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చని ఆలయం ఈవో రమాదేవి తెలిపారు. ఉత్సవాలు పూర్తి అయిన తర్వాత తలంబ్రాలను బుక్ చేసుకున్న భక్తులకు పంపిస్తామని పేర్కొన్నారు.
Similar News
News July 9, 2025
ఆ రోజు ఉపాధ్యాయులకు సెలవు మంజూరు చేయవద్దు: డీఈఓ

ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించాలని డీఈఓ రామారావు సూచించారు. తల్లిదండ్రులకు విద్యార్థుల ద్వారా ముందస్తు సమాచారం అందించాలన్నారు. సమావేశం నిర్వహించే రోజు పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కచ్చితంగా హాజరవ్వాలన్నారు. తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించే రోజు ఎవరికీ సెలవు మంజూరు చేయవద్దని తెలిపారు.
News July 9, 2025
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. తప్పిన ప్రమాదం

బిహార్ రాజధాని పట్నా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కాసేపటికే పక్షి ఢీకొనడంతో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు అప్రమత్తమైన ఆ ఫ్లైట్ను తిరిగి పట్నా విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఆ విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
News July 9, 2025
VJA: ‘క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలను వినియోగించుకోండి’

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో అమరావతిలో 2 రోజుల పాటు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలు ఏర్పాటు చేశామని CRDA కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన విజయవాడలోని తన కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 10న తుళ్లూరు CHC, 11న యర్రబాలెం UHCలో ఈ శిబిరాలు జరుగుతాయన్నారు. క్యాన్సర్ నిర్ధారణ సేవలు, అవగాహన కార్యక్రమాలు ఈ క్యాంపుల ద్వారా అందిస్తున్నామని, స్థానికులు వినియోగించుకోవాలని కోరారు.